నవజీవన్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కు పెను ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుండి చెన్నై వెళుతున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్ రైలు నుండి ఒక్క సారిగా పొగలు వ్యాపించాయి. దీంతో లోకే పైలట్ అప్రమత్తమైయ్యారు. రైలును మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేశారు. రైలు నుండి పొగలు ఎందుకు వచ్చాయని పరిశీలన చేయగా, బ్రేక్ లైనర్స్ పట్టివేయడంతో పొగలు వచ్చాయని అధికారులు గుర్తించారు.
రైలు నుండి పొగలు రావడంతో ప్రయాణీకులు భయాందోళనకు గురైయ్యారు. వెంటనే రైలు నుండి పరుగులు పెట్టారు. రైలును నిలిపివేయడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగకపోవడంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు. లోకో పైలట్ అప్రమత్తత వల్లనే పెను ప్రమాదం తప్పిందని భావిస్తున్నారు.