Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు తాను గతంలో దత్తత తీసుకున్న గ్రామాలలో కరోనా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేయడం తెలిసిందే. అంతకు ముందే విద్యా, వైద్య పరంగా ఇంకా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రోడ్లు వేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఈ ఏడాది వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో.. దత్తత తీసుకున్న రెండు గ్రామాల ప్రజలకు.. మొదటి డోస్ టీకా ఇటీవల వేయడం జరిగింది. రెండో డోస్ తాజాగా మహేష్ బృందం స్టార్ట్ చేయడం జరిగింది. మొదటిసారి వ్యాక్సిన్ వేయించుకున్న రెండు గ్రామాల ప్రజలకి ప్రణాళిక బద్ధంగా రెండో డోస్ వేస్తున్నారు.
ఇదిలా ఉంటే మహేష్ చేపట్టిన ఈ కార్యక్రమం పట్ల జాతీయ మీడియా అప్పట్లో ప్రశంసల వర్షం కురిపించింది. సోను సూద్ తర్వాత ఆ తరహాలో మహేష్ .. మాత్రమే ప్రజలకు ఏ రీతిగా ఉపయోగపడే కార్యక్రమం చేపట్టినట్లు అభినందించడం జరిగింది. మరోపక్క దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం… ప్రభుత్వాలు శరవేగంగా చేపడుతున్నాయి.
Read More: Mahesh babu: తన మేకప్ మాన్ కి సరికొత్త సర్ ప్రైజ్ ఇచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు..!!
ఇటువంటి తరుణంలో మహేష్ బాబు.. బాధ్యతాయుతంగా దత్తత తీసుకున్న గ్రామాల ప్రజల పట్ల శ్రద్ధ వహిస్తూ రెండో టీకా ఇవ్వటం సంచలనంగా మారింది. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఈ నెల 15 వ తారీకు నుండి స్టార్ట్ కానుంది. పక్కా ప్లానింగ్ తో సినిమా యూనిట్ షెడ్యూల్ కంప్లీట్ చేయడానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకోవడం జరిగింది.