సూపర్ స్టార్ మహేష్ బాబు ఇదివరకు తన సినిమాలు తాను చేసుకోవడం, లేదంటే తన పనేదో తను చూసుకోవడం అన్నట్లు ఉండేవాడు. అయితే నెమ్మదిగా యాడ్ లో కనిపించడం మొదలుపెట్టి విజయవంతంగా ఎన్నో యాడ్లకు బ్రాండ్ అంబాసీడర్గా వ్యవహరిస్తున్నారు. ఈ మధ్యకాలంలో మల్టీప్లెక్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టి, ఏషియన్ సినిమాస్ తో పార్ట్నర్ గా మారి, ఏఎంబి సినిమాస్ పేరిట హైదరాబాద్ లో మల్టీప్లెక్స్ ప్రారంభించాడు మహేష్ బాబు. ఇది దిగ్విజయంగా సంవత్సరం కూడా పూర్తి చేసుకుంది. ఇలా ప్రతి పనిలో తనదైనా ముద్రవేసుకుంటూ తన జర్నీని కొనసాగిస్తున్న మహేష్ బాబు సొంతంగా మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.
కాగా ఈ సంస్ద తరపున ఇప్పటికే సినిమా నిర్మాణం కూడా చేస్తున్నారు.. అలా ఇదివరకు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’, ‘శ్రీమంతుడు’ చిత్రాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించారు.. ఇక ప్రస్తుతం ఆన్ లైన్ స్ట్రీమింగ్ మాధ్యమాల్లో వెబ్ సిరీస్లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో.. ఈ హీరో, సినిమాలతో పాటు వెబ్ సిరీస్లను రూపొందించబోతున్నారు.. అయితే మహేష్ బాబు గతేడాది రెండు వెబ్ సిరీస్ల నిర్మాణం చేపట్టబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ దానిపై ఎటువంటి క్లారిటీ లేదు. ఈ లోపల మరోసారి వెబ్ సిరీస్ల విషయం వెలుగులోకి వచ్చింది..
అయితే తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం మహేష్ బాబు 25వ సినిమా ‘మహర్షి’కి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్ గా బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేశారట. అందుకు సంబంధించి వంశీ వర్క్ చేస్తున్నాడని సమాచారం.. కాగా భారీ బడ్జెట్తో రూపొందబోతున్న ఈ వెబ్ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడట ఈ దర్శకుడు.. ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా వస్తోన్న ‘మేజర్’ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇప్పుడు వంశీతో వెబ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తున్నాడు.. మొత్తానికి మహేష్ బాబు వెబ్ సిరీస్ రంగంలోకి దిగడంతో అందరి చూపు అటువైపే ఉందట.