Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమారంగంలో వరుసపెట్టి విజయాలు సాధిస్తున్న మహేష్… యాడ్స్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. ఇదే క్రమంలో వ్యాపార రంగంలో కూడా తిరుగులేని కెరియర్ కొనసాగిస్తూ ఉన్నారు. మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారం మహేష్ చేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరానికి దూరంలో AMB మల్టీప్లెక్స్ థియేటర్ మహేష్ ఓపెన్ చేయడం జరిగింది. సిటీకి దూరంగా ఉన్నా గాని సినిమా లవర్స్ నీ ఆకర్షించే రీతిలో… థియేటర్లు నిర్మించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డులో మహేష్ బాబు భారీ మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మించడానికి..AMB తరహాలోనే..ఈ థియేటర్ నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్ ల వ్యాపారం ప్రశ్నార్థకంగా మారింది. ఇటువంటి తరుణంలో మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ వ్యాపారాన్ని విస్తరించడానికి పూనుకొనటం.. సాహసమే అని అంటున్నారు సినీ విశ్లేషకులు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలకు సినిమా థియేటర్ల… వ్యాపారం దాదాపు సంవత్సరానికి పైగా నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఇటువంటి తరుణంలో చాలామంది సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలు తాము నిర్మించిన సినిమాలు… ఓటిటి లో రిలీజ్ చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఇలా ఉండగా.. మహేష్ బాబు ఒకపక్క వరుసపెట్టి సినిమాలు ఓకే చేస్తూ మరో పక్క.. మల్టీప్లెక్స్ సినిమా థియేటర్ ల వ్యాపారాన్ని విస్తరించడం ఇప్పుడు సంచలనంగా మారింది. మహేష్ మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు.. అంటూ తాజా వార్త పై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో… సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే తన పుట్టినరోజు నాడు ఆగస్టు 9వ తారీకు సినిమాకి సంబంధించి గ్లింప్స్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. వీడియో కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో అనేక రికార్డులు కూడా సృష్టించడం జరిగింది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తరువాత దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో.. మహేష్ బాబు సినిమాలు చేయనున్నారు. వీటిలో ఇప్పటికే త్రివిక్రమ్ సినిమా సర్కారు వారి పాట తర్వాత పట్టాలెక్కే చాన్స్ ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఒకపక్క కీలక ప్రాజెక్టులు ఒప్పుకుంటూ మరోపక్క… వ్యాపారాన్ని విస్తరించే పనిలో మహేష్ బిజీగా గడుపుతున్నారు. ఏది ఏమైనా సినిమా థియేటర్ల విషయంలో మహేష్.. విస్తరించడానికి పూనుకోవడం సాహసమే అని అంటున్నారు.
రెండోసారి హైదరాబాద్ నడిబొడ్డులో నిర్మించబోయే ఈ సరికొత్త మల్టీప్లెక్స్ థియేటర్ లో… సినీ లవర్స్ ని ఆకర్షించడానికి… అత్యాధునిక టెక్నాలజీతో ఈ రెండో మల్టీప్లెక్స్ థియేటర్ నిర్మిస్తారని టాక్. భారీ సిట్టింగ్ కెపాసిటీతో పాటు… హైఫై టెక్నాలజీస్ సౌండ్.. సిస్టం తో థియేటర్ నిర్మాణం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా మల్టీప్లెక్స్ రంగంలో తనదైన ముద్ర వేయడానికి మహేష్.. హైదరాబాద్ నడిబొడ్డులో నిర్మించబోయే ఈ మల్టీప్లెక్స్ థియేటర్ కి భారీ హంగులు తీర్చిదిద్దే రీతిలో.. ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.