Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి (Indira Devi) కన్నుమూసిన విషయం తెలిసిందే. తన తల్లి మరణాన్ని మహేష్ బాబు జీర్ణించుకోలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఇందిరా దేవి గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డారు. ఆ సమయంలో ఆమె AIG హాస్పిటల్లో చికిత్స పొందారు. కానీ ఈ విషయం గురించి ఎవరికీ తెలీదు. మహేష్ బాబు తన తల్లిని చూడటానికి రోజు హాస్పిటల్కి వెళ్తుండేవాడు. ఇందిరా దేవి మరణించడానికి ముందు రోజు మహేష్ తన తల్లి కోసం హాస్పిటల్కి వెళ్లగా అతని ఇంట్లో ఒక దొంగ దూరాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mahesh Babu: ఆ దొంగ ఏం చేశాడంటే
మహేష్ బాబు జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.81 ఉన్న నివాసముంటున్నాడు. అయితే ఒక గుర్తుతెలియని దుండగుడు మహేష్ బాబు ఇంటి గోడ దూకబోయి కిందపడ్డాడు. ఆ శబ్దానికి మహేష్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యి చూడగా అక్కడ ఓ వ్యక్తి కనిపించాడు. అతడికి కొన్ని గాయాలు కూడా అయ్యాయి. దాంతో సెక్యూరిటీ మ్యాన్ వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాడు. అక్కడికి వెళ్లిన పోలీసులు ఆ దొంగను హాస్పిటల్ లో జాయిన్ చేసి విచారించగా అతను ఒరిస్సాకు చెందిన వ్యక్తిగా తెలిసింది. ఆ దొంగ ఒరిస్సా నుంచి హైదరాబాదుకు మూడు రోజుల క్రితమే వచ్చి అక్కడే ఉన్న ఒక నర్సరీలో పనిచేస్తున్నాడట. మిగతా విషయాలు అతను పూర్తిగా కోలుకున్న తర్వాత విచారించి వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
బాగా డిస్టర్బ్ అయిన మహేష్
తన తల్లి ఇందిరా దేవి అనారోగ్యం వల్ల SSMB28 ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ను కూడా హడావుడిగా పూర్తి చేసినట్లు తెలిస్తుంది. త్రివిక్రమ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.