Mahesh Babu: అద్భుతమైన సినిమాలతో భారతీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి. ఏ ఇండియన్ మూవీ చేరుకోలేని రేంజ్లో బాహుబలిని జక్కన తీసాడు. బాహుబలి సినిమా తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రిబుల్ ఆర్ హిట్ అయింది కానీ బాహుబలికి మించిన సినిమాగా పేరు తెచ్చుకోలేకపోయింది. అయితే బాహుబలి అన్ని రికార్డులను మహేష్ బాబు సినిమాతో చేరిపేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు.
Mahesh Babu: చరిత్ర సృష్టించనున్న జక్కన్న-ప్రిన్స్ కాంబో
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
జక్కన్న మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తీయబోతున్నారు. ఆ సినిమా కోసం ఇప్పటినుంచే అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకే రాజమౌళి, కమల్ కణ్ణన్తో కలిసి పారిస్లోని యూనిట్ ఇమేజ్ అనే అంతర్జాతీయ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థని కలిసినట్లు తెలుస్తోంది. మాక్సిమ్ లారే, రెమి అనే ఈ సంస్థ కో-ఫౌండర్స్తో మాట్లాడి విజువల్ ఎఫెక్ట్స్ గురించి అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే సందేహాలను కూడా నివృత్తి చేసుకున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ మహేష్ సినిమా కోసమే అని అందరూ అనుకుంటున్నారు. అయితే రాజమౌళి పారిస్ ట్రిప్ గురించి పేర్కొంటూ ఒక ఫోటో కూడా షేర్ చేశాడు. ఆ ఫొటోలో కనిపించిన ఒక వ్యక్తి ఇప్పుడు ఓ చర్చకి దారి తీశాడు.
బాహుబలితో మహేష్-జక్కన్న మూవీకి ఉన్న లింక్ ఏంటి..?
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేష్తో కలిసి రాజమౌళి సినిమా చేస్తానని అధికారికంగా ప్రకటించిన విషయం విధితమే. అయితే పారిస్లో దిగిన ఫొటోలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా కనిపించాడు. దీనితో రాజమౌళితో అతనికి అక్కడ ఏం పని అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఫోటో చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. అదేంటంటే రాజమౌళి సినిమాలకి భారీ బడ్జెట్ ఎప్పుడు అవసరం అవుతూనే ఉంటుంది. అందుకే కే.ఎల్ నారాయణ కూడా ఈ సినిమా నిర్మాణ వ్యయం భరించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. శోభు యార్లగడ్డ ఒకరే ఈ సినిమాని నిర్మించే ధైర్యం చేయలేదేమో అందుకే కే.ఎల్ నారాయణ కూడా ముందుకు వచ్చారేమో అని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.