సూపర్ స్టార్ మహేష్ బాబు గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఈ ఏడాది ‘సర్కారు వారి పాట’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్నది. అలాగే మహేష్ సరసన ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే గతంలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమా లో మహేష్ సిస్టర్ రోల్ లో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం ఈమె ఈ సినిమాలో మహేష్ సిస్టర్గా కాకుండా వదినగా నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రేణు దేశాయ్ రోల్ ఈ సినిమాలో చాలా కీలకమైనదట..
ఈ మూవీ స్క్రిప్ట్ ను బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలకి సంబంధించిన స్ట్రాంగ్ కథాంశంతో డైరెక్టర్ పరశురామ్ రెడీ చేశారట. ఇక ఇందులో మహేష్ క్యారెక్టర్ విషయానికి వస్తే తను ఒక వ్యాపారవేత్తగా కనిపించనున్నాడట. అలాగే డైరెక్టర్ పరశురామ్ ఒకపక్కన ఈ సినిమా లో కామెడీకి పెద్ద పీట వేస్తూ మరోపక్క హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్గా తీర్చిదిద్దారట. ఈ నేపథ్యంలో సినీ వర్గాల్లో కీలకపాత్రలో రేణు దేశాయ్ నటించనుందనే లేటెస్ట్ అప్డేట్ హాట్ టాపిక్ గా మారింది.
ఇక మహేష్ బాబు ఈ ‘సర్కారు వారి పాట’ మూవీలో హీరోగా నటించడమే గాక చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామ్యం పంచుకున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థలు, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి థమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఇప్పటికే విడుదలైన ఆసక్తి రేకెత్తించాయి. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నట్లు తెలుస్తుంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!