సినీ ఇండస్ట్రీలో ఉండే వారి లైఫ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్షణం తీరిక లేకుండా నటనలో మునిగిపోతుంటారు. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరో, హీరోయిన్ల గురించి. సినిమాల మీద సినిమాలకు ఓకే చేసేస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంటారు వీళ్లు. సినిమాలో ఏ కొంత టైం దొరికినా ఫ్యామిలీతో అలా సరదాగా గడపాలని కోరుకుంటుంటారు.
ఈ బిజీ లైఫ్ కి కొంచెం బ్రేక్ ఇచ్చి సరదాగా కుటుంబ సభ్యులతో ఎటైనా బయటకు వెళ్లడానికి ప్లాన్స్ వేసుకుంటూ ఉంటారు. అయితే మన శ్రీమంతుడు కూడా దీపావళీ వేడుకలు తన కుటుంబ సభ్యులతో కలిసి భాగా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే వారం కిందట సూపర్ స్టార్ మహేశ్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఫ్లైటెక్కిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్లు వెళ్లింది ఎక్కడికో ట్రిప్ అయితే కాదండోయ్…
దీపావళీ పండుగ దినాన మహేశ్ కుటుంబం దుబాయ్ లో ఉండే ఆయన వదినమ్మ ఇంటికి వెళ్లారు. నమ్రత అక్క శిల్పా శిరోద్కర్ ఇంటికి వెళ్లారన్నమాట. అయితే అక్కడ వారందరూ దీపావళీ సెలబ్రేషన్స్ భాగా చేసుకున్నారు. అయితే ఈ సెలబ్రేషన్స్ తో పాటుగా అక్కడి వాతావరణాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించిన ఫోటోలను నమ్రత తన ఇన్ స్టా లో పోస్ట్ చేశారు.
ఈ ఫోటోలో నమ్రత, వారి పిల్లలు, వారి అక్క, భావ, మహేశ్ బాబు ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తన అనుభూతులను కూడా క్యాప్షన్ చేశారు. ఫ్యామిలీతో ఇలా పండుగ జరుపుకోవడం ఎన్నటికీ మర్చిపోలేనిది. ఇలాంటి క్షణాలు చాలా అమూల్యమైనవి, వీటిని తిరిగి పొందలేనవని నమ్రత రాసారు. అలాగే ఇలా మా ఇంట్లో కాకుండా ఇలా గడపడం కొత్తగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.