Mahesh babu: సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా సాఫ్ట్ నేచర్ అని అందరికీ తెలిసిందే. సినిమా కథల ఎంపికలో గానీ, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే పద్దతిలో గానీ తండ్రి సూపర్ స్టార్ కృష్ణనే రోల్ మోడల్గా తీసుకుని కెరీర్లో టాప్ పొజిషన్కి వచ్చాడు. మహేశ్ కంటూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మంచి మార్కెట్ ఉంది. వరుస సక్సెస్లతో మహేశ్ ఇప్పుడు టాలీవుడ్లో పాన్ ఇండియన్ స్టార్ అనే రేంజ్కు దగ్గరగా ఉన్నాడు. ఇక సినిమాల ఎంపికలో అన్నీ వర్గాల ఆడియన్స్ను దృష్ఠిలో పెట్టుకొనే చేస్తున్నాడు.
ఇక మహేశ్తో సినిమాలు తీసే నిర్మాతలు ఎపుడూ సేఫ్గా ఉండాలనే ఆకాంక్షతో ఉంటాడు. అందుకే తన సినిమాలు రిలీజ్ సమయం కూడా మంచి సోలో డేట్ చూసుకొనే వదులుతుంటాడు. గత నాలుగైదేళ్ళుగా మహేశ్తో సినిమాలు తీసిన నిర్మాతలు మంచి లాభాలను చూస్తున్నారు. ఆ కారణంగానే ఇప్పుడు తను నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను అందరికంటే ముందే సంక్రాంతి బరిలో దింపుతున్నాని ప్రకటించినప్పటికీ రాజమౌళి మాటకు రెస్పెక్ట్ ఇచ్చి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తను అనుకున్న డేట్ వదిలేసి బిగ్ సీజన్ అయిన సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నాడు.
Mahesh babu: రాజమౌళి కోసం సైడైపోయింది ఒక్క మహేశ్ బాబు మాత్రమే.
ఇదే ఇప్పుడు మహేశ్ బాబు ఫ్యాన్స్ను హర్ట్ చేస్తుందని టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ – రానా కాంప్రమైజ్ కాకుండా తమ భీమ్లా నాయక్ను అనుకున్న తేదీనే రిలీజ్ చేస్తున్నారు. ప్రభాస్ కూడా రాధే శ్యామ్ సినిమాను ముందు ప్రకటించిన డేట్ 2022, జనవరి 14న భారీ స్థాయిలో తీసుకువస్తున్నారు. ఎటొచ్చి రాజమౌళి కోసం సైడైపోయింది ఒక్క మహేశ్ బాబు మాత్రమే. మహేశ్ కూడా బరిలో ఉంటే ఆట మరోలా ఉండేది. కానీ సర్కారు వారి పాట సినిమాకు తాను కూడా ఒక నిర్మాత. ఎందుకొచ్చిన రిస్క్ అనే ఏప్రిల్ 1న సోలో డేట్ను ఎంచుకొని సర్కారు వారి పాటను పోస్ట్పోన్ చేసుకున్నాడు. ఫ్యాన్స్ హర్ట్ అయినా ఈ సినిమా రిలీజయ్యాక వసూళ్ళు చూసి హ్యాపీగా ఫీలవుతారని మహేశ్ బృందం అభిప్రాయపడుతున్నారట.