Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి జోరు మీద వున్నారు. కరోనా రాకముందు బాక్సాఫీస్ దగ్గర హాట్రిక్ విజయం సాధించిన మహేష్… ఇప్పుడు “సర్కారు వారి పాట” సినిమా తో మరో హ్యాట్రిక్ కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. గతంలో భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకు ఎవరు సినిమాలతో హ్యాట్రిక్ విజయం సాధించిన మహేష్… ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. “సర్కారు వారి పాట” సినిమా తర్వాత త్రివిక్రమ్ సినిమా తర్వాత రాజమౌళితో సినిమాలు ఒప్పుకొని.. బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టించడానికి మహేష్ రెడీ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే ఇటీవల మహేష్ పుట్టినరోజు సందర్భంగా “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి గ్లింప్స వీడియో రిలీజ్ అవ్వక సోషల్ మీడియాలో భారీ రికార్డులు సృష్టించడం తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రికార్డు సృష్టించిన సినిమాగా “సర్కారు వారి పాట” సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే మరో టార్గెట్ కి మహేష్ తాజాగా ఫిక్స్ అయ్యాడు.
విషయంలోకి వెళితే “సర్కారు వారి పాట” సినిమా పాలెం షూటింగ్ కేవలం 45 రోజుల్లో పూర్తి చేయాలని తాజాగా మహేష్ పిక్స్ అవటం జరిగిందట. కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాల కాలం వృధా కావడంతో… మహేష్ తాజాగా ఈ టార్గెట్ కి ఫిక్స్ అయినట్లు.. త్వరలోనే అనగా అక్టోబర్ ప్రారంభం కి సినిమా మొత్తం పూర్తి చేయడానికి మహేష్ సినిమా యూనిట్ కి కీలక ఆదేశాలు ఇచ్చినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.