సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’. సరిలేరు నీకెవ్వరు ఇచ్చిన బూస్ట్తో ఫుల్ జోష్లో సర్కారు వారి పాట అంటూ డిఫరెంట్ టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నాడు. గీత గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, మహేష్ బాబు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారని తెలిసిందే.
ఇక ఇప్పటికే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించినా 2021 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవనుంది. అమెరికాలో ముందు అనుకున్న మొదటి షెడ్యూల్ కోసం మహేష్ అమెరికా వెళుతున్నారని ఇటీవల ప్రచారమైంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో చిత్రబృందం అమెరికా షెడ్యూల్ ని ఏకంగా నాలుగు నెలల పాటు వాయిదా వేశార తాజా సమాచారం. ఈ రకంగా చూస్తే ఏప్రిల్ లో కానీ అక్కడ చిత్రీకరణకు వెళ్లరని అర్థమవుతోంది.
మరి ఇప్పుడున్న తాజా పరిస్దితులను బట్టి చూస్తే సర్కారు వారి పాట 2021 లో విడుదల అవడం కాస్త కష్టమని తెలుస్తుంది. ఇక ప్లాను మార్చుకున్న చిత్రయూనిట్ అంతవరకు ఇక్కడే పూర్తి చేయాల్సిన ఇతర షెడ్యూల్స్ షూటింగ్స్ కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట. కాగా ఈ చిత్రం బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో ఇంట్రెస్టింగ్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు పరశురాం తెరకెక్కించబోతున్నాడు. థమన్ సంగీతమందిస్తున్నాడు. బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్ మరో హీరోయిన్ గా నటించనుందని ప్రచారం జరుగుతోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?