మహానటి సినిమా కీర్తి సురేష్ కి విపరీతమైన క్రేజ్ ని తీసుకు వచ్చింది. ఈ సినిమా సక్సస్ తో వరసగా కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చక చకా ఒప్పేసుకుంది. అయితే ఇక్కడ సినిమాలు ఒప్పుకున్నదానికంటే ఆ సినిమాలు సక్సస్ అవడమే ఏ హీరోకైనా.. హీరోయిన్ కైనా ఇంపార్టెంట్. ఇండస్ట్రీలో సక్సస్ ఉంటేనే ఎవరినైనా పట్టించుకుంటారు. లేదంటే మన వనక ఎన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నా మెహం చాటేస్తారు. ఈ విషయం ఇప్పటికే చాలామంది నటీ, నటుల విషయంలో ప్రూవ్ అయింది.
అయితే అంత ప్రభావం కాకపోయినప్పటికి కాస్తో కూస్తో కీర్తి సురేష్ మీద పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాల ప్రభావం పడబోతుందని అంటున్నారు. థియోటర్స్ మూతపడటంతో కీర్తి సురేష్ నటించిన రెండు సినిమాలు ఓటీటీలో రిలీజై వరసగా పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలతో కీర్తి రేంజ్ ఇంకా పెరుగుతుందనుకుంటే ఒక్కసారిగా కిందకి జారిపోయింది.
అయితే ఇప్పుడు కీర్తి సురేష్ కొంత డైలమాలో పడిందని .. ఇకపై తను ఎంచుకునే సినిమాలు చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలని డిసైడయిందట. కాని అందరనుకున్నట్టు కాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట మీద పూర్తి నమ్మకంతో ఉందని తెలుస్తుంది. ఈ సినిమాతో మళ్ళీ తన సక్సస్ గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని ధీమాగా ఉందట.
ఇప్పటికే మహేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కి ప్రేక్షకులో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇక యూనివర్సల్ పాయింట్ కావడంతో పాన్ ఇండియన్ రేంజ్ సినిమాగా రూపొందబోతుంది కాబట్టి మహేష్ ఈ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నాడని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ఫ్లాపయినా మహేష్ మీద నమ్మకాలన్ని పెట్టుకుందట కీర్తి సురేష్.