2020 ప్రారంభంలోనే సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి కమర్షియల్ సక్సస్ ని అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో తన 27 వ సినిమాని చేయబోతుండగా రీసెంట్ గా ఈ సినిమాకి “సర్కారు వారి పాట” అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ మహేష్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. జీ.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తుండగా సెప్టెంబర్ నుంచి చిత్రీకరణ ప్రారంభం కాబోతుందని సమాచారం.
ఇక కరోనా మహమ్మారి తో సెలబ్రిటీస్ అంతా తమ ఇళ్ళల్లోనే ఉంటూ మనసుకి నచ్చిన పనులు చేసుకుంటూ ఫ్యామిలీతో గడుపుతున్నారు. మహేష్ కూడా తన ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేస్తూ పిల్లలు సితారా, గౌతం తో కలిసి నానా హంగామా చేస్తున్నారు. అంతేకాదు భాషతో సంబంధం లేకుండా నచ్చిన సినిమాలన్ని చూసేస్తున్నారు… నచ్చిన పుస్తకాలు చదువుతున్నారు. అలానే రీసెంట్ గా మహేష్ బాబు “ఓ మై కడవలే” అనే తమిళ సినిమాని చూశారట. ఆ సినిమా అద్భుతంగా ఉందని మహేష్ బాబు ట్వీట్ చేశాడు.
హీరోయిన్ రితికా సింగ్ కి మహేష్ స్వయంగా తను నటించిన ఓ మై కడవలే సినిమాను మెచ్చుకోవడం సూపర్ కిక్ ఇచ్చిందట. నేను నమ్మలేక పోతున్నాను, ధన్యవాదాలు సార్, అటూ సోషల్ మీడియా వేదికగా సంబరపడిపోయింది. అశోక్ సెల్వన్, రితికా సింగ్, వాణి భోజన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమాకి అశ్వత మారిముత్తు దర్శకత్వం వహించాడు. ఇక తెలుగులో ఇంతక ముందు విక్టరీ వెంకటేష్ తో కలిసి గురు సినిమాలో నటించింది రితికా సింగ్. ఈ సినిమాతో టాలీవుడ్ లో అవకాశాలు వస్తాయనుకుంటే ఎందుకనో నీవెవరో అన్న సినిమా ఒకటి చేసి మళ్ళీ కనిపించలేదు.