Mahesh babu: టాలీవుడ్లో రాజకుమారుడుగా ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు హీరోగా నటించిన మొదటి సినిమాతో ప్రిన్స్ అనే ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత మురారి, ఒక్కడు వంటి అద్భుతమైన సక్సెస్లు అందుకొని సూపర్ స్టార్గా మారాడు. ఇప్పుడు నిర్మాతగాను మహేశ్ మంచి సినిమాలను నిర్మిస్తున్నాడు. ఇలా ఒకవైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగాను కొనసాగుతున్న మహేశ్ స్క్రిప్ట్ నచ్చితే మల్టీస్టారర్ కూడా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇక గత కొంతకాలంగా మహేశ్ వరుస హిట్ అందుకుంటూ తన రేంజ్ను రెట్టింపు చేసుకున్నాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన పోకిరి సినిమాతో 75 ఏళ్ళ ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాశాడు. అయితే ఇలా వరుస చిత్రాలు చేస్తూ వస్తున్న మహేశ్ ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలన్నీ కూడా చాలా సేఫ్గా తనకి హిట్ దక్కేటువంటివే ఎంచుకుంటున్నాడు. క్రేజ్ అండ్ రేంజ్ పెరుగుతుంది కదా అని అందరూ భారీ బడ్జెట్ సినిమాల విషయంలో పెద్ద పెద్ద ప్రయోగాలు చేస్తుంటారు. ఆ ప్రయోగాలు ఫలిస్తే అందరికీ మంచి జరుగుతుంది. పొరపాటున ఏదైనా తేడా కొడితే మాత్రం మహేశ్కు ఫ్లాప్ రావడమే కాదు తనని నమ్మిన వాళ్ళ అందరికీ అన్నీ విధాలుగా తీవ్ర నష్టం జరుగుతుంది.
Mahesh babu: ఇవన్నీ మంచి ప్రయోగాలే. సక్సెస్ అయి ఉంటే వేరే లెవల్.
నా వల్ల వీరందరూ రిక్స్లో పడటం ఇష్టం లేదు..అందుకే స్క్రిప్ట్స్ విషయంలో ప్రయోగాలు చేయకుండా సేఫ్గా ఉండే స్క్రిప్ట్స్నే ఎంచుకుంటున్నానని తెలిపాడు. గతంలో మహేశ్ సైనికుడు అనే సినిమా చేశాడు. అలాగే నాని, స్పైడర్ లాంటి సినిమాలు చేశాడు. ఇవన్నీ మంచి ప్రయోగాలే. సక్సెస్ అయి ఉంటే వేరే లెవల్. కానీ ఆ ప్రయోగాల వల్ల మహేశ్ బాగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అందుకే జనాలకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయో..తనకి ఎలాంటి సినిమాలు చేస్తే సక్సెస్లు దక్కుతాయో అలాంటి సేఫ్ జోనర్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు. వాటిలో ఎక్కువగా సామాజిక అంశాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్న మహేశ్ వచ్చే ఏడాది ఏప్రిల్లో రాబోతున్నాడు.