Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు సామాజికంగా అనేక మంచి పనులు చేస్తారా అన్న సంగతి అందరికీ తెలుసు. దాదాపు 1000 మంది పేద వాళ్ళ పిల్లలకు గుండె ఆపరేషన్లు సొంత డబ్బుతో అతి ఖరీదైన వైద్యం చేయించి వాళ్ళ ప్రాణాలను మహేష్ నిలబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఇటీవల కరోనా కారణంగా.. గతంలో తను దత్తత తీసుకున్న రెండు గ్రామాల ప్రజలకు తన తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఫ్రీ గా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం చేసి రెండు గ్రామాలలో అర్హులైన ప్రజలందరికీ మహేష్ ఫ్రీగా వ్యాక్సిన్ వేయించారు.
ఈ విషయం నేషనల్ మీడియాలో రావడంతో మహేష్ పై పొగడ్తల వర్షం కురిపించడం జరిగింది. ఇదిలా ఉంటే తాజాగా ఇదే తరహాలో వ్యాక్సినేషన్ వేయించి మరోసారి మనసున్న శ్రీమంతుడు అని అనిపించుకున్నాడు మహేష్. విషయంలోకి వెళితే.. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో… ఇండస్ట్రీలో షూటింగ్లు స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ యూనిట్ మొత్తానికి ఫ్రీగా తానే యాక్షన్ వేయించటం జరిగిందట.
Read more: Mahesh Babu: మహేష్ “సర్కారు వారి పాట” కోసం బాలీవుడ్ ముద్దుగుమ్మ..??
వితౌట్ వ్యాక్సిన్ ఎవ్వరూ కూడా సెట్ లో అడుగు పెట్ట కూడదు అనే రూల్స్ కూడా అమలు చేసినట్లు ఏదిఏమైనా.. మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన వెంటనే ఏకధాటిగా షూటింగ్ స్టార్ట్ చేసి.. కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. సరిలేరు నీకెవ్వరు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ చేస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.