Mahesh Babu : గతంలో ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలాంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఎం.ఎస్.రాజు ప్రస్తుతం దర్శకుడిగా మారాడు. ఇటీవలే అతని దర్శకత్వంలో వచ్చిన ‘డర్టీ హరి’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక అతని కొడుకు సుమంత్ అశ్విన్ కూడా చాలా కాలంగా హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుమంత్ కి హీరోగా సరైన కమర్షియల్ సక్సెస్ లేకపోయినప్పటికీ…. అతను మాత్రం ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు.
ఇప్పుడు ఎమ్మెస్ రాజు కొడుకు సుమంత్ అశ్విన్ వ్యక్తిగత జీవితంలో కూడా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాడు. ఈనెల 13వ తారీఖున దీపిక అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసేందుకు రెడీ అయ్యాడు. ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. సుమంత్ అశ్విన్, దీపికల కుటుంబాలు వివాహం కు హైదరాబాద్లోని ఒక కన్వెన్షన్ హాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కరోనా కారణంగా ఎక్కువమందిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించట్లేదు అని సమాచారం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు ఇండస్ట్రీకి చెందిన అతి కొద్దిమంది ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
అయితే హీరో సుమంత్ అశ్విన్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి వీరాభిమాని అన్న విషయం అందరికి తెలిసిందే. మహేష్ తన పెళ్ళికి కచ్చితంగా రావాలని సుమంత్ అనుకుంటున్నాడట. అతనిని ఎట్టి పరిస్థితుల్లో ఆహ్వానించాలని కచ్చితంగా రావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈనెల 20 వరకు దుబాయ్ లో ఆ చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో సుమంత్ అశ్విన్ పెళ్ళికి మహేష్ బాబు ఎంతవరకు హాజరు అవుతాడు అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. సుమంత్ అశ్విన్ మహేష్ బాబు కి వీరాభిమాని. ఇక ఎమ్మెస్ రాజు నిర్మాణంలోనే మహేష్ ‘ఒక్కడు’ సినిమాతో పెద్ద స్టార్ గా ఎదిగాడు. మరి మహేష్ ఒకరోజు వీలు చూసుకుని అశ్విన్ పెళ్లికి హాజరు అవుతారు అని కొంత మంది అనుకుంటున్నారు. కానీ సుమంత్ అశ్విన్ మాత్రం ఎవరు వచ్చినా రాకపోయినా మహేష్ బాబు నా రావాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడట. మరి ఏమవుతుందో చూడాలి….