Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస విజయాలతో దూకుడు మీద ఉన్నాడు. ‘భరత్ అనే నేను’, ‘మహర్షి’, ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు వంద కోట్లకు పైగా వసూలు చేసి మహేష్ ను మళ్ళీ టాలీవుడ్ బాద్షా గా నిలబెట్టాయి అనే చెప్పాలి. అలాగే తన భవిష్యత్తు సినిమాలపై కూడా మహేష్ పూర్తి స్థాయిలో దృష్టి సారించాడు.
ఇప్పుడు చిన్న సినిమాల దర్శకుడు అయిన పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చేస్తున్న మహేష్ ఆ తర్వాత రాజమౌళి తో ఒక సినిమా చేయనున్నాడు అందరికీ తెలిసిందే. ఈ మధ్యలో త్రివిక్రమ్ ప్రాజెక్టు వచ్చి పడింది అన్న విషయం కూడా తెలిసిందే. రాజమౌళి సినిమా పై అందరికీ భారీ అంచనాలు ఉండగానే మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ పైన అంతకుమించిన హైప్ జనరేట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాయి.
బాక్సాఫీస్ వద్ద ‘ఖలేజా’ బోల్తా కొట్టినానప్పటికీ టీ.వి లో ఈ చిత్రం ప్రసారం చేస్తే ఇప్పటికీ జనం కుర్చీలకి అతుక్కుపోతారు. ఇదిలా ఉంటే మహేష్… రాజమౌళి సినిమా అయిపోయిన తర్వాత తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ సుధ కొంగర దర్శకత్వంలో కూడా ఒక సినిమా ఒప్పుకున్నాడని విశ్వసనీయవర్గాల సమాచారం. గతంలో ‘గురు’ చిత్రాన్ని… గత సంవవత్సరం వచ్చిన ‘ఆకాశమే హద్దు’ చిత్రాలను డైరెక్ట్ చేసిన సుధ కొంగర ఈ రెండు చిత్రాలకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకోగా బాక్సాఫీసు వద్ద అవి కూడా భారీ హిట్ గా నిలిచాయి. సూర్య ‘ఆకాశమే హద్దు’ అమెజాన్ లో అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాల జాబితాలో పలు రికార్డులు సాధించింది.
మరి మహేష్ తర్వాతి సినిమాలను చూస్తే పరశురాం చిత్రం పూర్తిగా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్. త్రివిక్రమ్ చిత్రంలో కుటుంబకథా అంశాలు ఉంటాయని లీకులు వచ్చాయి. రాజమౌళి సినిమా అయితే భారీ స్థాయిలో ఆఫ్రికన్ అడవుల్లోనే ఎక్కువ భాగం తెరకెక్కుతుందని చెప్పేశారు. సుధ కొంగర ఎక్కువగా కంటెంట్ ప్రధానంగా ఉండే చిత్రాలు తీస్తుంది.
అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ కి వీలు లేకపోయినప్పటికీ హీరోయిజం ఎలా ఎలివేట్ చేయాలన్నది ఆమెకు బాగా తెలుసు. మరి ఇటువంటి ఇంటరెస్టింగ్ లైనప్ పెట్టుకున్న మహేష్ రాబోయే మూడేళ్ళలో వేరే స్థాయికి వెళ్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!