Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. “సరిలేరు నీకెవ్వరు” అంటే భారీ బ్లాక్ బస్టర్ తర్వాత.. మహేష్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరం పైగానే జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. మహమ్మారి కరోనా రాక వల్ల అనేకమార్లు షూటింగ్ లకి అంతరాయం కలగటంతో ఇటీవల రెండో షెడ్యూల్ స్టార్ట్ చేసిన సినిమా యూనిట్ త్వరగా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ నితీష్ తివారి ఇటీవల మహేష్ బాబు కి బాలీవుడ్ రామాయణం స్టోరీ వినిపించినట్లు అందులో రాముడు క్యారెక్టర్ చేయాలని తెలపటంతో సున్నితంగా ఇంటర్నేషనల్ ప్రాజెక్టుని మహేష్ తిరస్కరించినట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమాలో హృతిక్ రోషన్.. దీపికా పదుకునే వంటి పెద్దపెద్ద స్టార్లు నటిస్తున్న కాని నెక్స్ట్ రాజమౌళి అదేరీతిలో త్రివిక్రమ్ సినిమాలు ఉండటంతో.. ఈ అంతర్జాతీయ సినిమాకి మహేష్ నో చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Mahesh babu : మహేష్ నో చెప్పిన ప్రాజెక్ట్ కి హృతిక్ గ్రీన్ సిగ్నల్..?
కరోనా కారణంగా దాదాపు రెండు సంవత్సరాలు.. చాలా సమయం వృధా కావడంతో వెంటవెంటనే త్రివిక్రమ్ అదే రీతిలో రాజమౌళి సినిమాలు కంప్లీట్ చేయాలని అందువల్లే బాలీవుడ్ రామాయణానికి మహేష్ నో చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఇదిలా ఉంటే ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో మహేష్ అభిమానులు నిరుత్సాహం చెందుతున్నారు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు డైరెక్ట్ పాన్ ఇండియా మూవీ లు చేస్తున్న తరుణంలో హృతిక్ రోషన్ పక్కన రాముడి గెటప్ తో అవకాశం రావడం.. అరుదైన ఛాన్సును ఇది అనవసరంగా మహేష్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు.