Mahesh Ntr: మహేష్(Mahesh), ఎన్టీఆర్(NTR) టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ముందు వరుసలో ఉంటారు. ఇద్దరి హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. ఇద్దరికీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇద్దరిలో ఏ ఒక్కరికి సినిమా రిలీజ్ అయినా గాని.. ఆరోజు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురుస్తుంది. ఇదిలా ఉంటే ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన “భరత్ అనే నేను” (Bharat Ane Nenu) సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎన్టీఆర్… మహేష్ బాబు తో తనకున్న బాండింగ్ గురించి అప్పట్లో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నయి.
మహేష్ తనకు అన్నలాంటి వాడని.. అరుదైన ఘట్టం.. ఆయనని ఎప్పుడు అలాగే ఉండాలి.. అంటూ మహేష్ బాబు పై ఎన్టీఆర్ అప్పట్లో కామెంట్ చేయడం జరిగింది. అదే సమయంలో మహేష్…. ఎన్టీఆర్ నటించిన “ఆది” సినిమా వేడుకలో కలిసాం. మళ్లీ తర్వాత ఇదే అయినా.. తారక్ లో చాలా నేర్చుకోవాలి.. అంటూ అప్పట్లో మహేష్ కూడా ఎన్టీఆర్ ని ప్రశంసించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న షో.. “ఎవరు మీలో కోటీశ్వరులు”. జెమినీ టీవీలో ప్రసారం అవుతున్న ఈ షోకి ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ షో కు ఇప్పటికే కొరటాల శివ, రాజమౌళి, సమంత,దేవిశ్రీ ప్రసాద్, థమన్ వంటి స్టార్స్ వచ్చారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్వరలో రానున్నరు.
ఇదిలా ఉంటే ఆ ఎపిసోడ్ ఇప్పటికే కంప్లీట్ కావడం జరిగింది. కాగా తాజాగా మహేష్ ఎన్టీఆర్.. గేమ్ ఆడిన ఈ ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన ప్రోమో లో వెల్కమ్ టు మహేష్ అన్న అని ఎన్టీఆర్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హాట్ సీట్లో కూర్చున్న మహేష్ బాబు అదిరిపోయింది అంటూ సెటప్ చూసి అంటాడు. ఆ వెంటనే నా రాజా… అంటూ ఎన్టీఆర్ డైలాగ్ వేస్తాడు. ఆ తర్వాత గేమ్ మధ్యలో.. కరెక్ట్ ఆన్సర్ దానికి తిప్పితే అటు తిప్పి ఇటు తిప్పి.. అని మహేష్ అనగా మధ్యలో ఎన్టీఆర్ సరదాగా అని చమత్కరించాడు నీ కంటే గురువుగారే బెటర్ గా ఉన్నారు అంటూ ఎన్టీఆర్ పై పంచ్ డైలాగ్ మహేష్.. వేయటంతో ఇద్దరూ చాలాసేపు నవ్వుకున్నారు ప్రోమో లో. ఈ ప్రోమో చూసిన ఇద్దరు అభిమానులతో పాటు సామాన్య సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కానున్నటు జెమిని టెలివిజన్ స్పష్టంచేసింది.