Mahesh Babu: పూరి జగన్నాథ్ ఎన్నో సంవత్సరాల క్రితం తన డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా తీయాలని అనుకున్నారు. బిజినెస్ మాన్ సినిమా తర్వాత మహేష్ బాబుతో ఈ ప్రాజెక్టు చేయాలని ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయి అని తెలిసింది. ఆ తర్వాత ఇద్దరూ వేరువేరు సినిమాలతో బిజీ అయిపోయి ఆ విషయం మరుగున పడిపోయింది. తర్వాత పూరి జగన్నాథ్ సినిమాలు ఫ్లాప్ కావడం, వేరే కారణాలు కూడా తోడు కావటం అలా ఈ సినిమా మొదలు పెట్టలేదు.
మహేష్ బాబు కి ఈ సినిమా పై ఎలాంటి ఆసక్తి లేదని పూరిజగన్నాథ్ కి తెలిసింది. విజయ్ దేవరకొండ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని పూరి అనుకుంటున్నారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. వీళ్ల ఇద్దరి కలయికలో లైగర్ అనే సినిమా త్వరలోనే రాబోతుందని మనందరికీ తెలిసిన సంగతే. విజయ్ పూరి కలిసి త్వరలోనే వీరి సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే ఆ సినిమా జనగణమన అని అంటున్నారు.
లైగర్ సినిమా పెద్ద హిట్ అవుతుందని పూరి విజయ్ ఇద్దరూ చాలా నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకంతోనే జనగణమన చిత్రం మొదలు పెడదామని ఆ ఇద్దరు అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. అంతా ఓకే అయినా లైగర్ విజయంపైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది.
లైగర్ హిట్ కాకపోతే వీళ్ళ ఇద్దరి కాంబినేషన్ కు క్రేజ్ ఉండదు. అప్పుడు జన గణ మన పరిస్థితి ఏమిటి. పూరి అంతకముందు చేసిన హీరోలతో మరో సినిమా మొదలవుతుంది అని చెప్పటం ఆ చిత్రాలు విజయం సాధించకపోవడంతో ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. నితిన్ తో హార్ట్ ఎటాక్ మహేష్ బాబుతో బిజినెస్ మాన్, బాలయ్య బాబుతో పైసా వసూల్ తర్వాత వీరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. లైగర్ విజయం సాధించి వీళ్లు జనగణమన మొదలుపెడతారు ఏమో వేచి చూడాల్సిందే.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!