Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ లు అందుకున్న తర్వాత ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్నాడు/ ఈ సినిమా తర్వాత అతనికి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తో ఒక ప్రాజెక్టు కన్ఫర్మ్ అయింది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం షూటింగ్ కూడా ఒకే సారిగా అయిపోవాలని ఎలాంటి బ్రేక్ లు ఇవ్వకూడదని రాజమౌళి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తర్వాత మహేష్ సినిమా ఉంటుందని ఈ లోపల ‘సర్కారు వారి పాట’ కూడా సంక్రాంతికి విడుదల అవుతుందని అందరూ అనుకొన్నారు. అయితే ఇక్కడే మహేష్ అభిమానుల ఆశలకు గండి పడింది/ రాజమౌళి తో చేయబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ముందు మహేష్ ఒక చిన్న సినిమా చేయబోతున్నాడని సమాచారం.
ఒక నాలుగైదు నెలల్లో అయిపోయే సినిమాకు మహేష్ సంతకం చేయబోతున్నాడట. ఇక ఆ కథను మహేష్ కు వినిపించింది అనిల్ రావిపూడి అని టాక్. అతనికి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి మళ్ళీ మహేష్ తో సినిమా చేయాలని ఆశగా ఉన్నాడు. ప్రస్తుతం అనిల్ ‘ఎఫ్ 2’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా అయిపోగానే మహేష్ తో ఒక చిన్న ప్రాజెక్టు చేయనున్నాడని సమాచారం.
‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కూడా చాలా త్వరగానే పూర్తి అయిపోయింది. ఇక ‘సర్కారు వారి పాట’ తర్వాత మహేష్ ను రాజమౌళి సినిమాలో చూద్దాం అని ఆశగా చూస్తున్న వారికి ఇది కొంచెం నిరాశ అనే చెప్పాలి. అయినప్పటికీ అనిల్ రావిపూడి ప్రేక్షకులను నిరుత్సాహపరచకుండా సినిమా తీస్తారని చాలా మంది భావిస్తున్నారు.