Mahesh Babu : ‘సరిలేరు నీకెవ్వరు’ హిట్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఏడాదిపాటు గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో మహేష్ నటిస్తున్నారు. ఈ సినిమాలో ఇప్పటికే అతనికి చెందిన అల్ట్రా మాస్ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ మహేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.
ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్ లో జరుగుతోంది. మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సందేశం కూడా ఉంటుందని సూపర్ స్టార్ ఇదివరకే తెలిపారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి మహేష్ బాబు కు చెందిన జిఎంబి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టు పై మహేష్ అభిమానులతో పాటు సాధారణ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు అన్న వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మహేష్ పూర్తి మాస్ గా ఉన్న ప్రీ-లుక్ మనం చూసేశాం. దుబాయి షెడ్యూల్ లో మహేష్ కు సంబంధించి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. వాటిల్లో మహేష్ బాబు పూర్తి క్లాస్ గా కనిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో రెండు పాత్రలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని అంటున్నారు. మహేష్ లీక్ అయిన పిక్చర్స్ వల్లే అతను ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్నారని ఈ వార్తలు బయటకు వచ్చాయి. ఇక నిజంగానే మహేష్ ఈ సినిమాలో రెండు పాత్రలు కనిపిస్తూ ఉంటే అది ఫ్యాన్స్కు అది డబుల్ బొనాంజా అనే అనాలి. మరి ‘సర్కారు వారి పాట’ కి సంబంధించిన అప్డేట్ వస్తే గాని మనకి ఏ విషయం అనేది పూర్తిగా క్లారిటీ వస్తుంది.