Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గీత గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇప్పటివరకు సరైనది ఏడాది నుండి రాలేదు. మే 31 వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా.. ప్రతి ఏడాది కొత్త సినిమా కి సంబంధించి.. పోస్టర్ లేదా వీడియో రిలీజ్ చేసిన మహేష్ ఈసారి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది అని మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూశారు. అయితే ఆ సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా.. దేశంలో విషాదఛాయలు అలుముకున్నాయి నేపథ్యంలో మహేష్ ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు.
దీంతో ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ఇటువంటి తరుణంలో.. మహేష్ తన పుట్టినరోజు అనగా ఆగస్టు 9 వ తారీకు నాడు.. సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మొన్నటివరకు రెడీ అవటం తెలిసిందే. దీంతో మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో భారీ ఎత్తున రికార్డు సృష్టించాలని.. అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పరిస్థితి ఇలా ఉండగా.. మహేష్ తన పుట్టినరోజు కి ముందే అభిమానులకు సరికొత్త ట్రీట్ అవ్వడానికి రెడీ అయ్యారు. విషయంలోకి వెళితే ఈ నెలాఖరున అనగా జూలై 31 వ తారీకు నాడు సినిమాకి సంబంధించి లేటెస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సినిమా యూనిట్ ఫస్ట్ నోటీస్ అనే పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. మహేష్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాకి సంబంధించి చిన్నపాటి వీడియో అదేరీతిలో RRR సినిమాకి సంబంధించిన పోస్టర్లు మరియు అనేక అప్డేట్లు వస్తున్న సమయంలో మహేష్ సినిమా వార్త రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త వాతావరణం నెలకొంది. అప్పట్లో గత ఏడాది తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు టైటిల్ తో కూడిన చిన్నపాటి పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయడం జరిగింది. గుబురు జుట్టుతో సరికొత్త మేకోవర్ లో.. మహేష్ లుక్కు ఉండటంతో.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈసారి రిలీజ్ చేయబోయే పోస్టర్ ద్వారా ఎటువంటి రికార్డులు సృష్టిస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.