సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది “సరిలేరు నీకెవ్వరు” సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొట్టమొదటి డిజిటల్ అందుకున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే హిస్టరీ క్రియేట్ చేసే తరహాలో కలెక్షన్లు సాధించింది. కాగా ఆ తర్వాత కరోనా రావడం లాక్డౌన్ ప్రభుత్వాలు పెట్టడంతో సినిమా ధియేటర్ పోవడంతో మహేష్ నెక్స్ట్ సినిమా ఏంటి అన్నది ఎవరికీ అర్థం కాని పరిస్థితి.
ఇలాంటి తరుణంలో లాక్డౌన్ సమయంలో “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నట్లు తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు మహేష్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదటిలో అమెరికాలో అనుకోక అక్కడ పరిస్థితులు అంతగా అనుకూలించకపోవడంతో తాజాగా హైదరాబాద్ లో స్టార్ట్ చేయాలని సినిమా యూనిట్ అనుకున్నట్టు మొన్నటి వరకు వార్తలొచ్చాయి.
కాని తాజాగా ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం దుబాయిలో మొదటి షెడ్యూల్ సినిమా యూనిట్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్ అక్కడికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు, త్వరలోనే సినిమా సెట్లోకి అడుగు పెట్టబోతున్నట్లు, అతి తక్కువ టైమ్ లోనే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్యాంకు స్కామ్ తరహా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్లు ఫిలిం వర్గాలలో టాక్ నడుస్తోంది.