Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “గీతా గోవిందం” డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో మహేష్ బాబు స్వయంగా ప్రకటించిన తరుణంలో మరొక హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కి నాంది అని కామెంట్ పెట్టడం జరిగింది. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినిమా టైటిల్ తో పాటు మహేష్ బాబు గుబురు జుట్టు తో పాటు మెడ మీద టాటూ కలిగిన పిక్ ఒకటి రిలీజ్ చేయడం అప్పట్లో హైలెట్ అయిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు మేకోవర్ సరి కొత్తగా ఉండటంతో సినిమా స్టోరీ ఏంటి అన్నదానిపై అప్పట్లోనే రకరకాల డిస్కషన్ లతోపాటు సినిమాపై ఆసక్తి నెలకొంది.
దుబాయ్ లో స్టార్ట్ Mahesh Babu
దిలా ఉంటే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో స్టార్ట్ అవ్వగానే..షూటింగ్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లొకేషన్ లో షూటింగ్ జరుగుతున్న ఫోటోలను స్వయంగా మహేష్ బాబు తన ఇంస్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. దాదాపు కొన్ని నెలల తర్వాత తన సినిమా షూటింగ్ లో పాల్గొనటం తో ఆనందంగా ఉంది అన్నట్టు మహేష్ కామెంట్ పెట్టారు. ఈ క్రమంలో దుబాయ్ లో షూటింగ్ కి సహకరిస్తూ స్వాగతం పలికిన కంపెనీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?