Mahesh Babu: నిన్న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు హోరెత్తించారు. పైగా మహేష్ నటించబోయే రెండు సినిమాలకు సంబంధించి అప్డేట్స్ రావడం తో వాటితో సోషల్ మీడియాలో సరికొత్త రికార్డును సృష్టించారు. అంత మాత్రమే కాక మహేష్ బాబు తో పనిచేసిన డైరెక్టర్లు.. సోషల్ మీడియాలో మహేష్ పై ఉన్న తమ అభిమానాన్ని రకరకాలుగా చాటుకున్నారు. మహేష్ ఫ్రెండ్స్ సోషల్ మీడియాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఫ్యాన్స్ స్పేస్ కార్యక్రమంలో చాలా మంది డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబు పై కీలక వ్యాఖ్యలు చేశారు. అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత.. ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు తనకి పర్సనల్ గా ఫోన్ చేయటం మరియు అభినందించడం జరిగిందని వారిలో మహేష్ కూడా ఒకరు అని తెలిపారు.
అంతే కాకుండా నెక్స్ట్ ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అని ఆ టైంలో మాట ఇచ్చారని తాను రెండు స్టోరీలు కూడా వినిపించడం జరిగింది అని.. కానీ మధ్యలోనే ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయి అని తెలిపారు. తర్వాత మహేష్ బాబు తో ఒక యాడ్ షూటింగ్ చేయడం జరిగిందని.. చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు డైరెక్టర్లు మహేష్ బాబు ని కేవలం 25 శాతం మాత్రమే ఉపయోగించుకోవడం జరిగిందని… మిగిలిన 75 శాతం ఎవరు ఉపయోగించుకో లేదని సందీప్ రెడ్డి వంగా సంచలన కామెంట్ చేశారు.
సరైన స్టోరీ తో మహేష్ బాబుని సరిగ్గా వెండి తెరపై చూపిస్తే బొమ్మ అదిరిపోతుందని పేర్కొన్నారు. ఏది ఏమైనా త్వరలో కచ్చితంగా మహేష్ బాబు తో సినిమా చేయడం జరుగుతుందని సందీప్ రెడ్డి వంగా అభిమానులకు మహేష్ బర్త్ డే సందర్భంగా మాట ఇచ్చారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న “దూకుడు” డైరెక్టర్ శ్రీను వైట్ల ..మహేష్ దూకుడు తో తనకే మంచి హిట్ ఇచ్చాడని..అజయ్ క్యారెక్టర్ ఎక్స్టెండ్ తో అవకాశం ఉంటే మల్లి మహేష్ తో సినిమా చేస్తాను అని అన్నట్లు సోషల్ మీడియాలో టాక్. ఇక ఇదే సమయంలో మహేష్ బాబు తో చేసిన.. మిగతా డైరెక్టర్లు కూడా.. మహేష్ బాబు పై తమ అభిమానాన్ని చాట్టే రీతిలో కామెంట్ చేయడం జరిగింది.