టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకుమారుడు సినిమాతో కృష్ణ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ గుర్తింపు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తన కెరియర్లో “ఒక్కడు” సినిమాతో బారి బ్లాక్ బస్టర్ అందుకోవటం జరిగింది. ఎమ్మెస్ రాజు నిర్మాణ సారధ్యంలో వచ్చిన ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించారు.
2003వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా మహేష్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇదిలా ఉండగా ఈ సినిమా నిర్మాత ఎమ్మెస్ రాజు తాజాగా మళ్లీ ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఎమ్మెస్ రాజు నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కొంత కాలం గ్యాప్ తీసుకున్న తర్వాత ఇటీవల `డర్టీ హరి` సినిమా తో మళ్లీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు.
ఈ సినిమా ఖచ్చితంగా తన కెరీర్ కి కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని ఎం.ఎస్. రాజు ఫుల్ కాన్ఫిడెన్స్ తో వున్నారు. మళ్లీ తన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ ని ఘనంగా రీలాంచ్ చేయబోతున్నారట. ఈ బ్యానర్ లో త్వరలో సినిమాల నిర్మాణం ప్రారంభిస్తాను అని మహేష్ తో మళ్లీ సినిమా చేస్తానని ఎం.ఎస్. రాజు అంటున్నట్లు టాక్ వస్తుంది. మరి మహేష్ తో ఒక్కడు సినిమా సీక్వెల్ తీస్తే ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా సినిమా ఉంటుందా లేక పోతే వేరే తరహాలో నిర్మిస్తారో అన్నది మహేష్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మహేష్.. ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి తో మహేష్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ రెండు సినిమాల తర్వాత ఎమ్మెస్ రాజు “ఒక్కడు” సీక్వెల్ సినిమా ఉంటుందని మహేష్ అభిమానులు అనుకుంటున్నారు.