Maharshi: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ సినిమాగా మహర్షి నిలిచింది. మహేష్ కెరియర్ లో 25వ సినిమా గా వచ్చిన .. ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కింది. అదిరిపోయే స్టోరీ లైన్ తో… వ్యవసాయాన్ని ప్రధాన అంశంగా మాత్రమే కాక హార్డ్ వర్క్ నీ హైలెట్ చేస్తూ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన విధానం సినిమా ప్రేక్షకులను అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ఆల్రెడీ జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం తెలిసిందే. అయితే తాజాగా సౌత్ ఇండస్ట్రీలో ప్రముఖ జ్యూరీ అవార్డు “సైమా” కి “మహర్షి” సెలక్ట్ అవ్వడం జరిగింది.
సెప్టెంబర్ నెలలో ఈ అవార్డులు ప్రదానం చేయనున్నారు. సౌత్ ఇండస్ట్రీ లోనే పేరుగాంచిన ఎవడికి మహర్షి తాజాగా సెలక్ట్ కావడంతో మహేష్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఖచ్చితంగా మహర్షికి సైమా అవార్డు రావటం గ్యారెంటీ అని అంటున్నారు. నేషనల్ అవార్డు రావడంతో గ్యారెంటీగా సైమా అవార్డు కూడా వస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ టైమ్ ప్రస్తుతం నడుస్తుందని ఎవరూ ఆపలేరని ఫ్యాన్స్ తాజా వార్త పై సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే మరో పక్క మహేష్ బాబు కరోనా నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలు.. గ్యాప్ రావడంతో … ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను చాలా త్వరగా కంప్లీట్ చేయడానికి పక్కా షెడ్యూల్ తో.. షూటింగులు చకచకా కానిస్తున్నారు. “సర్కారు వారి పాట” సినిమా తర్వాత త్రివిక్రమ్.. ఆ తర్వాత రాజమౌళి వంటి టాప్ దర్శకులను లైన్లో పెడుతూ.. ఎదురులేని కెరియర్ లో.. మహేష్ దూసుకుపోయేలా పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సర్కారు వారి పాట సినిమా అక్టోబర్ నెల లో కంప్లీట్ అయిన తర్వాత వెంటనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేసేలా మహేష్ పక్కా ప్లానింగ్ తో ఉన్నారు.