Mahesh Babu: మహమ్మారి కరోనా కారణంగా టాప్ హీరోల సినిమాలకు భారీ గ్యాప్ వాటిల్లింది. గత ఏడాది మార్చి నుండి స్టార్ట్ అయిన ఈ బ్యాడ్ టైం ఇంకా కొనసాగుతూనే ఉంది. అడపాదడపా కొంచెం రిలాక్స్ చేస్తున్నా గాని తర్వాత వెంటనే వైరస్ పంచుకుంటూ ఉండటంతో ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు సినిమాల షూటింగ్ లకు అంతరాయం కలుగుతుంది. ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్రిక్ బ్లాక్బస్టర్ విజయాలను సాధించిన మహేష్ బాబు … స్టార్ట్ చేసిన సర్కారు వారి పాట సినిమాకి కూడా అనేక అడ్డంకులు కలగటం తెలిసిందే. మహేష్ బాబు చివరి గా రిలీజైన సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా తర్వాత వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మహేష్ సినిమా చేస్తున్నట్లు అప్పట్లో ప్రకటనలు రాగా ఆ సినిమా ఓకే అయినట్లు అయ్యి ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లటం జరిగింది.
అదే సమయంలో గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం ప్రాజెక్టు ఓకే కావడంతో సినిమా మొదలవుతున్న తరుణంలో కరోనా ఎంట్రీ ఇవ్వడం.. ఆ తర్వాత షూటింగ్ స్టార్ట్ అయి మొదటి షెడ్యూల్ కంప్లీట్ అవ్వగానే కరోనా సెకండ్ వేవ్ రావటం తెలిసిందే. అయితే ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు అనుకూలంగా ఉండటంతో మహేష్ బాబు మంచి స్పీడ్ మీద సినిమా కంప్లీట్ చేసేస్తున్నారు.
తాజాగా మహేష్ బాబు “సర్కారు వారి పాట” కొత్త షెడ్యూల్ లో పాల్గొన్నారు. గోవాలో ఒక యాక్షన్ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ లో మహేష్ తో పాటుగా ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ పాల్గొన్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో .. సినిమా అనుకున్న టైం కి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని మహేష్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు. దీంతో చాలావరకు సినిమా కంప్లీట్ చేయాలని… అనుకున్న సమయం కంటే ముందుగానే సినిమా కంప్లీట్ అయ్యేలా మహేష్ అండ్ సినిమా యూనిట్ ప్లాన్ అన్నట్లు ఇండస్ట్రీ టాక్.