కృతి సనన్ అందానికి ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. మోడలింగ్ కెరీర్ నుంచి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన కృతి సనన్ నటనతోనూ కాదు తన అందంతోనూ అందరినీ అలరిస్తోంది.. కృతి సనన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. 2014లో మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో అరంగేట్రం చేశారు.. అయితే ఈ చిత్రం ఫ్లాప్ కావడంతో కృతి సనన్ కి మైనస్ గా మారింది.. అయితే ఈ సినిమాలో కృతి నటన, అందానికి మంచి మార్కులే పడ్డాయి.
అయితే ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ అనగానే కృతి సనన్ ఎన్నో ఆశలు పెట్టుకుంది..ఒక హిట్ పడితే చాలు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోవచ్చని భావించింది. కానీ ఆమె కలలు నిజం కాలేదు.. సుకుమార్, మహేష్ నేనొక్కడినే సినిమా నిరాశ పరిచింది. ఆ తర్వాత నాగచైతన్యతో దోచేయ్ సినిమా చేసింది. ఇక ఆ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో కృతి సనన్ కి ఆఫర్లు రావడం కష్టమైంది.. చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీలో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది.
ఇక లాభం లేదని కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. టైగర్ ష్రాఫ్ ‘హీరోపంతి’ సినిమా ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్ లో ఆమెకు వరుస సక్సెలు వచ్చాయి. దీంతో ఆమె క్రేజీ హీరోయిన్ గా పాపులర్ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా మారింది.. ప్రస్తుతం ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ లో నటిస్తోంది.. కృతి సనన్ అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయినా.. సరైన హిట్ లేకపోవడంతో టాలీవుడ్ లో అవకాశాలు రాలేదు.. ఆదిపురుష్ హిట్ అయితే మాత్రం టాలీవుడ్ లో మళ్లీ అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి..