దేశంలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురావటానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాయి. వీలైతే ఈ నెల 13 వ తారీకు నుండి దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క ఇండియా దేశం పంపిణీ చేయబోయే వ్యాక్సిన్ పై ప్రపంచ దేశాలు పనితనం ఎలా ఉంటుందా అని ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి.
ఇటువంటి తరుణంలో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ అక్క బాలీవుడ్ నటి శిల్పాశిరోద్కర్ కరోనా టీకా వేయించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. దుబాయి దేశం లో స్థిరపడిన ఆమె ఆ దేశంలో వాక్సిన్ వేయించుకున్నాట్లు స్పష్టం చేసింది. అంత మాత్రమే కాక వ్యాక్సిన్ వేయించుకున్నక గతంలో మాదిరిగా భయం లేని జీవితాన్ని కొనసాగించవచ్చని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది.
ఇదే తరుణంలో దుబాయ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఇక్కడ గమ్మత్తయిన విషయం ఏమిటంటే కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న తొలి బాలీవుడ్ నటి కూడా మహేష్ బాబు భార్య సొంత అక్క శిల్పా శిరోద్కర్ కావడం గమనార్హం. మరో పక్క దేశంలో అందుబాటులోకి రాబోతున్నాయి కరోనా వ్యాక్సిన్ దశలవారీగా పంపిణీ చేయాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనదేశంలో డ్రైరన్ జరుగుతోంది. చాలావరకు ప్రపంచ చరిత్రలో టీకాలు అందుబాటులోకి తీసుకువచ్చే విషయంలో భారత అద్భుతమైన ఫలితాలు సాధించడంతో.. తాజాగా త్వరలో అందుబాటులోకి భారత్ తీసుకురాబోతున్నారు కరోనా వ్యాక్సిన్ పనితనం పై ప్రపంచ దేశాలు చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నాయి.