తూర్పు గోదావరి జిల్లా శబరి నది వంతెనపై ఘోర ప్రమాదం సంభవించింది. శబరి నదిలో వెళుతోన్న లాంచీ వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో లాంచీలో 10 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది.
వరద బాధితులకు సరుకులు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ఘోర ప్రమాదం సంభవించింది. చీకటి కావడంతో ప్రమాదం స్థాయిని అంచనా వేయడానికి కష్టంగా ఉంది. ఘటనా ప్రాంతానికి చేరుకుంటున్న రెవిన్యూ, పోలీస్ అధికారులు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్దిసేపట్లో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి.