వచ్చే ఏడాది ఫిబ్రవరి పదో తారీకు తో గ్రేటర్ పాలకవర్గం కాలపరిమితి ముగియనున్న ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన పార్టీలలో టెన్షన్ నెలకొంది. మొన్ననే గ్రేటర్ ఎన్నికలు జరగగా ఏ ప్రధాన పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటక పోవడంతో మేయర్ కుర్చీలో ఎవరు కూర్చుంటారు అనే దాని విషయంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే తెలంగాణలో ఏ రెండు పార్టీలు కూడా కలిసే అవకాశం లేదు అన్నట్టు కన్ఫ్యూజన్ నెలకొంది. గ్రేటర్ ఎన్నికలలో అన్నిటికంటే టిఆర్ఎస్ పార్టీకి 58 సీట్లు రాగా బిజెపికి 46, ఎంఐఎం పార్టీకి 44 స్థానాలు రావడం జరిగింది. కేవలం రెండు స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది.
అయితే ప్రస్తుత పాలకవర్గానికి సంబంధించి కాలపరిమితి చివరి దశకు రావడంతో… ఈ రెండు పార్టీలు కలవకపోతే పరిస్థితి ఏంటి అన్నది తాజాగా ఉత్పన్నమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ఎంఐఎం – టిఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. కారణం చూస్తే గ్రేటర్లో ఎన్నికలు జరిగిన సమయంలో ప్రచారంలో ప్రత్యర్థులు రెండు పార్టీలు ఒక్కటేనని పదే పదే ప్రస్తావించాయి. ఈ తరుణంలో ఎంఐఎం బలంగా ఉన్న చోట టిఆర్ఎస్ పార్టీ పోటీకి దిగి రెండు పార్టీల మధ్య ఎటువంటి సంబంధం లేదని టిఆర్ఎస్ నేతలు జాగ్రత్తపడ్డారు. ఇటువంటి తరుణంలో బీజేపీ – ఎంఐఎం కలవటం అనేది అసాధ్యం అని అందరికీ తెలుసు. దీంతో ఏ రెండు పార్టీలు కలవకపోతే నెక్స్ట్ ఏంటి అనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండే ఉంటుందని, లేకపోతే స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉంటుందని టాక్. మరి ఫిబ్రవరి మాసం కల్లా ఏం జరుగుతుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?