అనుష్క చిత్రం అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఉండటం సహజం. బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన అనుష్క నటించిన చిత్రాలకు మంచి మార్కెట్ ఉంది. బహుశా ఈ పాపులారిటీని చూసే కావచ్చూ కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్న ప్రముఖ రచయిత కోన వెంకట్, అనుష్కతో ‘నిశబ్దం’ చిత్రాన్ని నిర్మించారు. కాగా అనుష్క, మాధవన్, అంజలి ప్రధాన పాత్రలతో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య ఓటీటీలో విడుదలై నిరాశపరిచింది. దీంతో ఎన్నో చిత్రాలకు కథ కథనం మాటలు అందించి సక్సెస్ అయిన కోన వెంకట్ ప్రొడ్యూసర్ గా మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు నమోదు చేయలేకపోతున్నాడనే ప్రశ్న ఫిలిం వర్గాల్లో మొదలైందట.
ఈ క్రమంలో ప్రస్తుతం కోన వెంకట్ నిర్మాణ సారథ్యంలో ‘రౌడీ బేబీ’ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఇందులో సందీప్ కిషన్ హీరోగా, ‘మెహబూబా’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా.. రాజేంద్రప్రసాద్, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారట. కాగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. అయితే ‘నిశబ్దం’ మూవీ అపజయం ఈ చిత్రాన్ని నీడలా వెంటాడుతుందట. ఎందుకంటే ‘నిశబ్దం’ సినిమా తీసి చేతులు కాల్చుకున్న కోన వెంకట్ హవా ప్రస్తుతం ఇండస్ట్రీలో తగ్గిపోవడంతో ఆ ఎఫెక్ట్ ‘రౌడీ బేబి’ చిత్రం పై పడిందని ఫిల్మ్ సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయట.
అదీగాక కొందరైతే ‘రౌడీ బేబి’ మరో ‘నిశబ్దం’ లా అవకుండా ఉంటే చాలంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారట. దీంతో ఈ చిత్రం రిలీజ్ విషయంలో మేకర్స్కు టెన్షన్ మొదలైందట ఈ మూవీ. ఏదైతే నేమి అనుష్క నిశ్శబ్ధం ఫ్లాప్ ఎఫెక్ట్ ‘రౌడీ బేబీ’ చిత్రం బాగానే పడిందని మాట్లాడుకుంటున్నారు. ఇక కోన వెంకట్ కరణం మల్లీశ్వరీ బయోపిక్ కూడా ప్లాన్ చేశారు. ప్రాజెక్ట్ ని అనౌన్స్ కూడా చేశారు. మరి ఎమందుకనో ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ కి సంబంధించిన న్యూస్ ఏదీ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు.