శబరిమల(కేరళ), జనవరి 14: శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం సాయంత్రం 6.45 గంటలకు పొన్నాంబలమేడు కొండపై జ్యోతి దర్శనమివ్వనుంది.
మకర జ్యోతిని దర్శించుకునేందుకు పలు రాష్ట్రాలనుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అయ్యప్ప మాలాధారులు స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం మకరజ్యోతి దర్శనం కోసం వేచి చూస్తున్నారు.
మరోవైపు పందళం నుండి తిరువాభరణాలతో రాజవంశస్తులు బయలుదేరారు. సాయంత్రానికి ఆభరణాలు స్వామి సన్నిధానం చేరుకోనున్నాయి.
10నుంచి 50 ఏళ్ళ లోపు మహిళలు అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం వివాదాస్పదంగా మారింది.
సుప్రీం కోర్టు మహిళలు దర్శించుకోవడానికి అనుమతినివ్వడం అందుకు కేరళ ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. మహిళల దర్శనం అనంతరం కేరళలో భారతీయ జనతాపార్టీ, పలు హిందూత్వ సంస్ధలు ఆందోళనలు చేపట్టాయి. కొన్నిచోట్ల హింసాత్మక సంఘటనలు జరిగాయి.
మకర జ్యోతి దర్శనం సందర్భంగా ఎటువంటి తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు.
ఆలయ సాంప్రదాయం ప్రకారం రుతుక్రమం ఉన్న మహిళలు స్వామిని దర్శించుకోరాదు.
previous post
next post