(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
విజయవాడ: ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్గా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పోరేషన్ ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ సలహాదారు రామచంద్రమూర్తి, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవురపల్లి అమర్, ప్రముఖ గేయరచయిత జొన్నవిత్తుల, టిటిడి ప్రధాన అర్చకులు రమణదీక్షితులు, యువజన నాయకుడు దేవినేని అవినాష్, విజయవాడ మాజీ మేయర్ జంద్యాల శంకర్, బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు జె శ్రీనివాస్ తదితరులు పాల్గొని కార్పోరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన మల్లాది విష్ణును అభినందించారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పడిన బ్రాహ్మణ కార్పోరేషన్కు తొలుత రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు, తరువాత ఆనందసూర్యలు చైర్మన్లుగా వ్యవహరించారు. కార్పోరేషన్ మూడవ చైర్మన్గా మల్లాది విష్ణు నేడు బాధ్యతలు చేపట్టారు.