KCR : “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి”.. ఈ మాట అన్నది సాక్షాత్తు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. అవును… మినిస్టర్ సాబ్ అసెంబ్లీలో తన మనసులోని ఆకాంక్షను బయటపెట్టారు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారు చిన్నప్పటి నుంచి అవే పథకాలు రన్ చేస్తున్నాయని.. ఏదో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు.
70 ఏళ్ల పాలించిన కాంగ్రెస్ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించిన మల్లారెడ్డి.. సీఎం కేసీఆర్ ఏడు సంవత్సరాలలోనే చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు. రాష్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. సాగునీరు, త్రాగునీరు, ఫించన్లు అర్హులైన అందరికీ అందజేసిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రిది అని తెలిపారు. దేశం చూపు తెలంగాణ వైపు ఉందని, అందుకే కేసీఆర్ను పీఎం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఒక్కసారి పీఎం అయితే.. అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని ఆయన పేర్కొన్నారు. చివర్లో తన స్పీచ్ ముగిస్తూ తన శాఖ పద్దు చాలా చిన్నదని.. సభ్యులందరూ సహకరించి పద్దును ఆమోదించాలని కోరడంతో మంత్రులు..హరీష్ రావు, కేటీఆర్ సహా సభ్యులంతా నవ్వులు చిందించారు.కాగా ఇప్పడే కాదు మంత్రి మల్లారెడ్డి సభలో ఎప్పుడు ప్రసంగించినా.. తన మార్క్ కామెంట్స్ చేస్తారు. గతంలో కూడా ఆయన పలుసార్లు చేసిన కామెంట్స్ వైరలయ్యాయి. ఆయన మాట్లాడే విధానం.. యాస విభిన్నంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
తెలంగాణ మంత్రుల రూటే సపరేటు!
రెండు మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయాలంటూ మంత్రులు పల్లవి అందుకున్నారు.సీనియర్ మంత్రి ఈటల రాజేందర్ తో మొదలైన ఈ గానాబజానా చాలా రోజులు సాగింది. ఏకంగా పద్మారావు అనే మంత్రయితే కేటీఆర్ ఉన్న సభావేదికమీదే ఆయన్ను కాబోయే ముఖ్యమంత్రి అంటూ కీర్తించారు.అయితే కేటీఆర్ ఖండించకపోగా చిరు నవ్వులు చిందించడం ఇక్కడ విశేషం.అయితే మధ్యలో ఏమైందో గానీ కెసిఆర్ కి చుర్రుమంది. ముఖ్యమంత్రి మార్పు లేదు..ఇకపై ఆ తరహా ప్రకటనలు చేస్తే తోకలు కత్తిరిస్తానని స్థాయిలో కెసిఆర్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు.ఇంతటితో ఆ ఎపిసోడ్ ముగియగా ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి కేసీఆర్ ని పీఎం చేయాలన్న పిలుపుతో కొత్త ఘట్టానికి తెర తీశారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?