NewsOrbit
జాతీయం న్యూస్

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో రాజకీయ ‘తుఫాన్’!ఇద్దరు మాజీ సహచరుల పిలక మమతా బెనర్జీ చేతిలో!

Mamata Banerjee: మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించిన సువేందు అధికారి ,తనను వీడిపోయిన రాజీవ్ బెనర్జీల జుట్టు  ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి చిక్కింది.మమతా బెనర్జీ క్యాబినెట్లో మంత్రులుగా ఉన్న వీరిద్దరూ మొన్నటి ఎన్నికల సందర్బంగా బిజెపిలోకి దూకేశారు.

Mamata Banerjee hands over political 'storm' in West Bengal to two former colleagues
Mamata Banerjee hands over political storm in West Bengal to two former colleagues

వీరిలో సువేందు అధికారి ఆమెను నందిగ్రామ్ లో రెండు వేల ఓట్ల తేడాతో ఓడించారు కూడా.ఒంటి చేత్తో పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెసు ను మూడోసారి మళ్లీ అధికారంలోకి తెచ్చిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా స్వయంగా ఓడిపోవడం ఆమెకు అవమాన భారాన్ని మిగిల్చింది.పైగా ఈ ఇద్దరు మంత్రులను ఆమె గట్టిగా నమ్మారు ..వారిని తన సన్నిహితులుగా భావించారు.అయితే వారు బిజెపిలో చేరడంతో ఆమె దిగ్భ్రాంతికి గురయ్యారు. తన ఎన్నికల ప్రచారంలో వారిద్దర్నీ ద్రోహులుగా కూడా మమతా బెనర్జీ అభివర్ణించారు.ఇది జరిగి నెల రోజులు కాకముందే యాస్ తుఫాన్ పశ్చిమ బెంగాల్ ను ముంచెత్తింది. దాదాపు నూట ముప్ఫై కరకట్టలు కొట్టుకుపోయాయి. ఆ ఇద్దరు “ద్రోహుల”పని పట్టడానికి ఇదే మమతా బెనర్జీకి ఆయుధంగా దొరికింది.

ఇలా దొరికింది ఆమెకు వారి పిలక!

రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బ తీయటానికి ఒక అవకాశం కోసం ఎవరైనా సరే ఎదురు చూస్తుంటారు.ఆ పనే ఇప్పుడు మమతా బెనర్జీ చేశారు.మమతా బెనర్జీ క్యాబినెట్లో రాజీవ్ బెనర్జీ, సువేందు అధికారి నీటిపారుదల శాఖ మంత్రులు గా పదేళ్లు కొనసాగారు.2011 నుండి 2018వరకు రాజీవ్ బెనర్జీ ,ఆ తరువాత గత ఏడాది డిసెంబర్ వరకు సువే౦దుఅధికారి నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్నారు.వీరి హయాంలోనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆ కరకట్టలను నిర్మించారు.అవన్నీ ఇప్పుడు కొట్టుకుపోవడంతో మమతా బెనర్జీ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.తద్వారా తన మాజీ సహచరులు ఇద్దరిని విచారణలో గట్టిగా ఇరికించేశారు.గురువారం నాడు మమతా బెనర్జీ యాష్ తుఫాన్ నష్టాలపై ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా తన దృష్టికి నీటిపారుదలశాఖ రంగానికి వాటిల్లిన నష్టం రావడంతో ఆమె గట్టిగా స్పందించారు.అయితే ఆమె ఆ ఇద్దరి మాజీ మంత్రుల పేర్లు ఎత్తకుండానే పటిష్టంగా నిర్మించామని చెబుతున్న ఈ కరకట్టల కొట్టుకుపోయాయి అంటే ఆ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందంటూ వ్యాఖ్యానించారు.ప్రకృతి వైపరీత్యాలను దృష్టిలో పెట్టుకొని కట్టిన బ్రిడ్జీలు కూడా కనిపించకుండా పోయాయి అంటే ఏం జరిగిందో అర్థమవుతుందన్నారు
ప్రజాధన౦ దుర్వినియోగాన్ని తాను సహించబోనని అన్ని కోణాల్లో విచారణ జరిపి నివేదిక సమర్పిస్తే బాధ్యులైనవారిపై చర్యలు తీసుకుంటానని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అయితే రాజీవ్ బెనర్జీ గానీ సుభేందు అధికారి గాని ఇప్పటివరకు ఈ విషయమై స్పందించలేదు.

 

author avatar
Yandamuri

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju