BJP: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో సై అంటే సై అన్న తరహాలో.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఉన్న సంగతి తెలిసిందే. బెంగాల్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో.. మమతా బెనర్జీ ని ఎలాగైనా ఓడించడానికి బిజెపి విశ్వ ప్రయత్నాలు చేయడం జరిగింది. అయినాగానీ మమతాబెనర్జీ పార్టీ ఊహించని విధంగా ప్రభుత్వం బెంగాల్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించింది. దాంతో బెంగాల్ రాష్ట్రంలో భారీ గెలుపుతో.. మమతా బెనర్జీ బిజెపికి వ్యతిరేకంగా ఉండే పార్టీలతో కలిసి ముందుకు నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవల వర్షాకాల పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా బిజెపి పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలు.. సమావేశమైన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు కూడా హాజరయ్యేలా దిధీ చక్రం తిప్పింది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాలలో భాగంగా గోవాలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గోవాలో ప్రస్తుతం బిజెపి పార్టీ అధికారంలో ఉంది.
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా గానీ పెద్దగా బలంగా లేదు. ఈ నేపథ్యంలో.. మమతా బెనర్జీ గోవా అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పోటీచేసే తరహాలో ఇప్పటి నుండే వ్యూహాలను సిద్ధం చేయడం జరిగింది. అంత మాత్రమే కాక బెంగాల్ రాష్ట్రంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్.. గోవా అసెంబ్లీ ఎన్నికలలో కూడా మమతా బెనర్జీ పార్టీకి మళ్లీ పని చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గోవాలో ప్రచారం చేస్తూ ఉండగా త్వరలోనే మమతాబెనర్జీ బిజెపి పార్టీ కి వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి.. సన్నద్ధం అయినట్లు సమాచారం.