సార్వత్రిక ఎన్నికలకు ముందు మోడీకి వ్యతిరేకంగా విపక్షాల కూటమి అంటూ జాతీయ స్థాయిలో హడావుడి చేసిన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఎన్నికల అనంతరం నోరెత్తిన పాపాన పోలేదు.దీంతో ఆయనను నమ్ముకున్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మంత్రి మమతా బెనర్జీ నిండా మునిగిపోయారు. అదెంత వరకు వెళ్లిందంటే తాజాగా ప్రధాని మోడీ బుధవారం సాయంత్రం కరోనాపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్కు మమతాబెనర్జీని ఆహ్వానించలేదు.
2019 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాల సమష్టి నాయకత్వం అవసరమంటూ ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ, కర్నాటక సీఎం కుమారస్వామి తదితరులంతా ఒక కూటమిగా హల్చల్ చేశారు. అప్పట్లో తాను లేదా మీరు (మమతా) మాత్రమే ప్రధానికి అర్హులమని బాబు ఆశ చూపడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర సర్కార్పై కాస్త ఎక్కువ దూకుడు ప్రదర్శించారు.గత ఏడాది జనవరి 19న మమతాబెనర్జీ నేతృత్వంలో కోల్కత్తాలో మహార్యాలీ నిర్వహించారు. బాబుతో కలిసి మోదీపై ఒంటికాలిపై లేచారు.ఇవన్నీ ప్రధాని మోదీ బాగానే గుర్తుపెట్టుకున్నారు.కరోనా వీడియో కాన్ప్రెన్స్ కి ఆమెను ప్రధాని ఆహ్వానించకపోవడమే ఇందుకో నిదర్శనం.ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మోడీ సర్కార్ అఖండ మెజార్టీతో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడం, ఏపీలో చంద్రబాబు ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో బాబు పూర్తిగా సరెండర్ అయ్యారు. మోడీ ప్రాపకం కోసం బాబు చేయని ప్రయత్నం లేదు. నాడు బాబు లాంటి సీనియర్ నేతల అండ చూసుకుని బీజేపీతో మమతా బెనర్జీ రెచ్చిపోయారు. ఇప్పుడు బాబే జారిపోయాడు.ఆమె ప్రధాని మోడీకి డైరెక్టు టార్గెట్లయ్యారు. తన ప్రధాన ప్రత్యర్థి బీజేపీ కావడం ఆమెకు ఆందోళన కలిగిస్తోంది.
మరో వైపు నాడు మోడీ సర్కార్పై పోరాటానికి ఉసిగొల్పిన వాళ్లు నైతిక మద్దతు కూడా ఇవ్వకపోవడం, మరోవైపు కేంద్రం ముందు సాగిలపడడంతో మమతాబెనర్జీకి వాస్తవం ఏంటో తెలిసొచ్చింది. మోడీపై పోరాటంలో ముందుకే తప్ప…వెనక్కి తగ్గలేని పరిస్థితి.ఈ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ఎలా నెగ్గుకొస్తారో వేచిచూడాలి
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?