పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అక్కడ రాజకీయ వాతావరణం చూస్తే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి బిజెపి పార్టీకి మధ్య పోటా పోటీ నెలకొని ఉంది. చాలావరకూ వస్తున్న సర్వేలు బట్టి చూస్తే విజయం దోబూచులాడుతున్నట్లు తెలుస్తోంది. కాగా మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కమలం పార్టీ భారీగానే దాదాపు 40 శాతం ఓట్లు రావడంతో.. ఈసారి కచ్చితంగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయాలని ఫుల్ గా డిసైడ్ అయిపోయింది.
ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది నేతలు పశ్చిమబెంగాల్ లో బిజెపి పార్టీ తరఫున క్యాంపెయిన్ చేస్తూ మరో పక్క అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రజాప్రతినిధులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా కేంద్రాన్ని ఢీ కొనడానికి మమతాబెనర్జీ తాజాగా సరికొత్త వ్యూహం తో రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మేటర్ లోకి వెళితే ఇటీవల నేతాజీ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ ర్యాలీ మమతా బెనర్జీ నిర్వహించింది.
ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ గురించి అప్పటి చరిత్రకారులు ఏమన్నారో తెలియజేస్తూ దేశానికి నాలుగు రాజధానులు ఉంటే ఏమవుతుంది అంటూ సరికొత్త నినాదం ఎత్తుకుంది. బ్రిటిష్ వారు దేశాన్ని పరిపాలించిన సమయంలో కోల్కతాను రాజధానిగా చేసుకొని పరిపాలించారని అలాంటప్పుడు దేశంలో ఒక రాజధాని నగరం ఎందుకని, నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలని మమతా బెనర్జీ పేర్కొంది. అంతేకాకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నేతాజీ విగ్రహానికి నిర్మించడానికి రెడీ అవ్వాలని బెంగాల్ ప్రజలకు పిలుపునిచ్చింది. ఇదే తరుణంలో విగ్రహాలు మరియు పార్లమెంట్ కాంప్లెక్స్ అంటూ వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అని ఇండైరెక్టుగా కేంద్రానికి సెటైర్లు వేసింది.