ఢిల్లీ, ఫిబ్రవరి 13: 16వ లోక్సభ చివరి రోజైన బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు.
పార్లమెంట్ భవనం ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తృణముల్ కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రార్థన చేశారు.
‘నరేంద్ర మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపి, దేశంలో ప్రజాస్వామ్యంను కాపాడాలని’ మహత్మా గాంధీజీని ప్రార్థించినట్లు ఈ సందర్భంగా మమత బెనర్జీ తెలిపారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని మమతా బెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో బిజెపితో పోరాడటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ప్రాంతీయ పార్టీలతో మహకూటమిగా ఏర్పడ్డారు. మోదీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేయాలన్న లక్ష్యంతో బిజెపియేతర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.