టెక్నాలజీ రంగంలో ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలు చేయడంలో జపాన్ ఎప్పుడూ ముందే ఉంటుంది. అక్కడ ఎప్పుడూ కొత్త కొత్త ఆవిష్కణలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా అక్కడి టోక్యో సిటీలో అధికారులు వినూత్న ప్రయోగం చేస్తున్నారు. ఆ సిటీలో మ్యాన్ హోల్స్ ఇకపై బల్బులు వెలిగినట్లు వెలుగుతాయి.
జపాన్లోని టోక్యో సిటీలో పలు చోట్ల మ్యాన్ హోల్ కవర్లను ఎల్ఈడీ లైట్లతో తీర్చిదిద్దారు. వాటిపై ప్రత్యేక కార్టూన్ కవర్లను ఏర్పాటు చేశారు. అలా మొత్తం 27 డిజైన్లను మ్యాన్ హోల్స్పై తీర్చిదిద్ది వాటిని రహదారులపై ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ మ్యాన్హోల్ పై ఉండే లైట్లు సాయంత్రం 5 నుంచి రాత్రి 2 గంటల వరకు వెలుగుతాయి. అవి సౌర శక్తితో వెలుగుతాయి.
ఈ మ్యాన్హోల్స్ వల్ల రహదారులు నూతన శోభను సంతరించుకోవడంతోపాటు అక్కడ నేరాలను కూడా తగ్గించవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఇలా మ్యాన్హోల్స్ను ఎల్ఈడీ లైట్లతో తీర్చిదిద్దడంపై అక్కడి ప్రజలు కూడా తమ అనుకూలతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ మ్యాన్హోల్స్ పై ఎప్పటికప్పుడు కవర్లను మార్చి యాడ్స్ ను కూడా ప్రదర్శించనున్నారు. కాగా చీకట్లో మ్యాన్హోల్ కవర్స్ ఎల్ఈడీ లైట్ల వెలుగులో మెరుస్తుండడాన్ని చూస్తే మనస్సుకు ఉల్లాసంగా అనిపిస్తుందని అక్కడి ప్రజలు చెబుతున్నారు.