ఈ లాక్ డౌన్ కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణంగా కన్నా ఎక్కువ జరుగుతున్నాయని సర్వేలు చెబుతున్నాయి. సాధారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, మాటామాటా అనుకోవడం ప్రతీ ఇంట్లో జరిగేదే. అయితే భార్య చీపురుతో కొట్టిందని కలత చెందిన ఒక వ్యక్తి ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ సంఘటన కోల్ కతాలో జరిగింది. అక్కడ నివసించే సౌమిత్రి అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే ఇద్దరి మధ్యా అప్పుడప్పుడు మాట తేడా వస్తుండేదిట. అయితే శనివారం రోజున గొడవ జరగ్గా, భార్య చీపురుతో కొట్టింది. ఆమె తల్లి కూడా అక్కడే ఉండి తన కూతుర్ని సమర్ధించింది. దీంతో కలత చెందిన యువకుడు ఉరి చేసుకుని చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?