ఇంటర్నెట్ రాకతో ప్రపంచం నట్టింట్లోకి వచ్చింది. నట్టింటిని కూడా అర చేతిలోకి తెచ్చిన గొప్ప సాధనం మొబైల్. ఇప్పుడు ఈ రెండింటిని విడదీసి చెప్పలేమేమో.. మొబైల్ ఉందంటే అందులో డాటా బ్యాలన్స్ ఉండాల్సిందే. అలా కాకుండా డాటా లేకుండా మొబైల్ ఉంటే అది ఉన్నా.. లేకున్నట్లే. అందుకే డాటా ఎక్కువగా వచ్చే సిమ్ కార్డును వాడేందుకు అందరూ ఇష్టపడుతారు. అయితే.. ఎక్కడో ఉన్న వారితో మాట్లాడడానికి ఉపయోగ పడుతుంది అనుకున్న ఇంటర్నెట్ ఇప్పుడు కొత్త రూపం దాల్చింది.
ఇంటర్నెట్ వాడకంతో ఎన్నో విషయాలు తెలిసే మాట అటు ఉంచితే.. అది ఇప్పుడు చాలా మందికి వ్యసనంగా మారిపోయింది. మొబైల్ లేకుండా ఒక్క క్షణం ఉండలేకపోతున్నారు. స్నేహితులు, బందువులు ఎవరున్నా.. లేకున్నా.. మొబైల్ చేతిలో ఉండాల్సిందే.. అందులో మొబైల్ డాటా ఉండాల్సిందే. అలా లేకపోతే.. ఎంత దూరమైనా పోయి వేయించుకోవాల్సిందే. డబ్బులు లేకపోతే గొడవలకు దిగాల్సిందే అన్నట్లు మారింది నేటి యువకుల తీరు.
ఏది ఏమైనా ఫోన్ అరచేతిలో ఉండాలి. అలా ఉండకపోతే.. కోపం తన్నుకుంటూ వచ్చేస్తుంది. అందుకే దీనిమీద పలువురు డాక్టర్లు మాట్లాడుతూ.. ఎక్కువగా మొబైల్ వాడితే అదో వ్యసనం అని దానితో ఎన్నో సమస్యలు వస్తాయని చెబుతునే ఉన్నారు. కానీ నేడు మొబైల్ వాడకం సర్వ సాధారణం అయిపోయింది. అది లేకపోతే.. ఏదీ చేయాలనిపించని స్థితిలోకి చాలా మంది వెళ్లిపోయారు.
అయితే అలా పోయిన స్థితిలో ఎన్నో నేరాలు కూడా చేస్తున్నారు. సొంత కుటుంబ సభ్యులతో పోట్లాడి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మళ్లీ ఒకటి రాజస్థాన్లోని జోధ్పూర్లోనూ జరిగింది. తన మొబైల్ డాటాను అయిపోగొట్టినందుకు గొడవ పడటమే కాకుండా తమ్ముడి ప్రాణాలను తీశాడు ఒక ప్రబుద్ధుడు.
జోధ్పూర్లో నివాసముండే రామన్, రాయ్ అనే ఇద్దరు వ్యక్తులు అన్నాదమ్ములు. పోయిన బుధవారం రాయ్ (23), అన్న రామన్కు తెలియకుండా అతని ఫోన్ లోని మొబైల్ డాటాను పూర్తిగా అయిపోగొట్టాడు. దాంతో విషయం తెలుసుకున్న రామన్ తమ్ముడి మీద కోపంతో గొడవకు దిగాడు. చివరకు తన తమ్ముడిని బిల్డింగ్ మీదకు తీసుకుపోయి కత్తితో ఛాతీలో నాలుగైదుసార్లు పొడిచాడు. దాంతోరాయ్ కు తీవ్రంగా రక్తస్రావం అయ్యింది.
దీన్ని చూసిని రామన్ అక్కడి నుంచి పారిపోయాడు. కొద్దిసేపటికి కుటుంబ సభ్యులు చూసి అతన్ని హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే అను మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు రామన్ కోసం గాలిస్తున్నారు. దీనిపై కేసు నమొదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.