చేసిన దొంగతనం బయటపడుతుందని ఏకంగా హత్య చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఘటనలో నిందితుడు తప్పించుకుందామంటే తాను వేసుకున్న ఫ్యాంటే పట్టించింది. విస్తుగొలిపే ఈ ఘటనలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వెంకట శివప్రసాద్(56) ముప్పై ఏళ్ల కిందటే హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడే కూలీ పనులు చేసుకుంటూ నివసిస్తున్నాడు. ఈనెల 26న బాలానగర్ లోని ఓ టీ జంక్షన్ వద్ద ఒంటిపై గాయాలతో మృతి చెందాడు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా సమీపంలోని సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించారు.
ఆరోజు ఫుట్ పాత్ పై ఉన్న శివప్రసాద్ పై ఓ వ్యక్తి కూర్చుని మొహంపై కొడుతూ. పిడిగుద్దులు గుద్దుతూ కనిపించాడు. నిందితుడు మాస్క్ పెట్టుకోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. అయితే.. నిందితుడు వేసుకున్న ఫ్యాంటకు రేడియం స్టిక్కర్ ఉండటం గమనించారు పోలీసులు. దీంతో సమీపంలోని ఫతేనగర్ బ్రిడ్జి కింద ఉన్న గుడిసెల్లో తనిఖీలు చేయగా ఓ గుడిసెలో ఆ ఫ్యాంటు లభ్యమైంది. దీంతో ఆ ఫ్యాంట్ వేసకున్నది బోయిన్పల్లి ఎంఎంఆర్ గార్డెన్స్ వద్ద నివసించే పాత నేరస్థుడు పి.నాగరాజు(33)గా గుర్తించారు. దీంతో నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించాడు.
‘ఈ నెల 26న తెల్లవారఝామున టీ జంక్షన్లోని ఓ దుకాణంలో దొంగతనం చేస్తుండగా వెంకట శివప్రసాద్ చూసి పెద్దగా కేకలు వేశాడు. నా గురించి బయటకు చెప్పేస్తాడనే అనుమానంతో చంపేశాను. హత్య అనంతరం అతడి జేబులోని రూ.200 తీసుకుని అక్కడినుంచి పరరయ్యాను’ అని చెప్పుకొచ్చాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?