Manasa radhakrishnan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే రక రకాల వార్తలు పుట్టించడానికి గాసిప్ రాయుళ్ళు ఏ రేంజ్ లో తయారవుతుంటారో అందరికీ తెలిసిందే. ఆయన సినిమా రిలీజ్ కి ముందే సీన్స్ కి సీన్స్ లీక్ చేసేస్తున్నారు. అది సినిమాకే ప్లస్ అవుతుంది. రాజకీయాలలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాతో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే 6 ప్రాజెక్ట్స్ కమిటయిన పవర్ స్టార్ వకీల్ సాబ్ రిలీజ్ కూడా చేశాడు. మిగతా 5 సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సన్నాహాలు చేసుకున్నాడు. కరోనా దెబ్బ లేకపోతే ఈ పాటికే మరో రెండు సినిమాల షూటింగ్ దాదాపు పూర్తి చేసి ఉండేవాడు.
ఆయన కెరీర్ లో మొదటి సారి పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. అదే హరిహర వీరమల్లు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఒక హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. 200 కోట్ల బడ్జెట్ తో ఏ.ఎం.రత్నం తన సొంత బ్యానర్ మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. అలాగే ఏకే రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి రానా మరిక హీరో పాత్రలో నటిస్తుండగా సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నాడు.
Manasa radhakrishnan : పవన్ సరసన నటిస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు.
ఈ రెండు సినిమాలు ప్యార్లల్ గా చేస్తున్న పవన్ మరో రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకి తీసుకు రావాలని ప్లాన్ చేశాడు. వాటిలో ఒకటి హరీష్ శంకర్ సినిమా, మరొకటి సురేందర్ రెడ్డి సినిమా. అయితే హరీష్ శంకర్ దర్శకత్వం వహించబోతున్న సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ మానస రాధాకృష్ణన్ హీరోయిన్ గా ఫిక్స్ అని తెగ సోషల్ మీడియాలో అభిమానులు ప్రచారం చేశారు. దీనికి ఆ అమ్మాయి క్లారిటీ ఇచ్చింది. నన్ను ఎవరి ఈ సినిమా కోసం అడగలేదని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వార్తలు గాలి వార్తలేనని తేల్చి చెప్పేసింది. అయితే అమ్మడు అందం చూసి ఈ అమ్మాయి పవన్ సరసన నటిస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.