Manchu Manoj : మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి చాలాకాలం అవుతోంది. 2014 లో వచ్చిన కరెంట్ తీగ సినిమా తర్వాత మళ్ళీ హిట్ అన్నది మనోజ్ అకౌంట్ లో పడలేదు. ఆ తర్వాత మనోజ్ నుంచి వచ్చిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతు వచ్చాయి. 2017 లో వచ్చిన ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు సినిమా రాలేదు. దాదాపు మూడేళ్ళు గ్యాప్ తర్వాత మంచు మనోజ్ నుంచి ఏకంగా పాన్ ఇండియన్ సినిమా రాబోతోంది. ఈ సినిమా గత ఏడాదే రావాల్సి ఉండగా కరోనా వల్ల డిలే అవుతూ వచ్చింది.
ఎట్టకేలకి నాన్ స్టాప్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. యాక్షన్స్ సీన్స్ ని భారీగా తెరకెకిస్తున్నారు. ఈ సినిమాని ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ‘అహం బ్రహ్మాస్మి’ అన్న టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరుగుతున్నాయి. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా అయినప్పటికి ఈ సినిమా మంచు మనోజ్ కి మంచి కం బ్యాక్ సినిమా అవుతుందని చెప్పుకుంటున్నారు.
Manchu Manoj : మంచు మనోజ్ మాత్రమే కాదు మంచి విష్ణు మోసగాళ్ళు అన్న పాన్ ఇండియన్ సినిమాతో రాబోతున్నాడు.
కాగా ఈ సినిమా సాంగ్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఈ సాంగ్ సంస్కృతంలో సాగుతుందని సమాచారం. ఇక ఈ సినిమాని మంచు మనోజ్ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం మంచు మనోజ్ మాత్రమే కాదు మంచి విష్ణు మోసగాళ్ళు అన్న పాన్ ఇండియన్ సినిమాతో రాబోతున్నాడు. కాజల్ అగర్వాల్ మంచి విష్ణు కి సోదరిగా నటిస్తోంది. ఇక మంచు మోహన్ బాబు కూడా సన్నాఫ్ ఇండియా అన్న భారీ సినిమాలో నటిస్తున్నారు. దేశభక్తి ప్రధానంగా సాగే ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తోంది.