AP High Court: రాజధాని అమరావతి ప్రాంత మందడం రైతులు హైకోర్టును ఆశ్రయించారు. రాజధాని రైతులకు సీఆర్డీఏ చెల్లించాల్సిన వార్షిక కౌలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మందడం గ్రామ రైతులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను ఎల్లుండి 16వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టనున్నది. మందడం రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ వాదనలు వినిపించనున్నారు.
అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణాలకు లాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ప్రతి ఏటా మే నెలలో కౌలు చెల్లించాల్సి ఉంటుంది. గత ఏడాది కరోనా నేపథ్యంలో రెండు నెలల ఆలస్యంగా కౌలు చెల్లింపులు జరిపారు. కౌలు ఆలస్యంపై రైతులు ఆందోళన చేశారు.