దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ ఉన్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలు నిషేధించబడిన సంగతి తెలిసిందే. రెండో రకం కరోనా వైరస్ రావటంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు గుంపులుగా ఉండకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ సంబరాలు అంబరాన్ని అంటాయి. హైదరాబాద్ నగరం లో నిషేధం విధించిన గాని కొత్త సంవత్సరాది వేడుకలకు ప్రభుత్వం అనుమతి లేకపోయినా గాని భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి.
ఎనిమిది కోట్ల అరవై ఐదు కేసులు లిక్కర్, 6 కోట్ల 62 లక్షల బీర్ల అమ్మకాలు గట్టిగా జరిగాయి. నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 758.76 కోట్ల మద్యం అమ్ముడైంది . దీంతో ఇదే రికార్డు స్థాయి అమ్మకాలు కావటంతో ప్రభుత్వానికి కొత్త ఏడాదిలో భారీగానే డబ్బులు మద్యం వచ్చినట్లు తెలంగాణ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో మద్యం అమ్మకాలపై చాలావరకు జగన్ సర్కార్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరగడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి లాభాలు గట్టిగానే వస్తున్నాయి .
ఈ క్రమంలో కొత్త సంవత్సరంలో మందుబాబులు భారీగా ఎంజాయ్ చేయడంతో మద్యం అమ్మకాలు వార్డు స్థాయిలో జరగడంతో ప్రభుత్వ వర్గాలు ఫుల్ హ్యాపీ గా ఉన్నాయి . కొత్త సంవత్సరం సరికొత్తగా కలిసి వచ్చినట్లు మద్యం అమ్మకాలపై వచ్చిన లాభాలను ఉద్దేశిస్తూ తెలంగాణ రాజకీయ వర్గాలలో వార్తలు వస్తున్నాయి .